టాలీవుడ్ లో శివాజీరాజా ఎన్నో క్యారెక్టర్ పాత్రల్లో నటించారు.  ఆ మద్య కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించారు.  నటుడిగా మంచి ఫామ్ లో ఉన్న ఆయన గత యేడాది మా అసోసియేషన్ ఎన్నికల్లో గెలుపొంది అధ్యక్షుడి గా ఎన్నికయ్యారు.  అయితే గత కొంత కాలంగా మా అసోసియేషన్ ఎన్నికల సమయంలో ఎన్నో వివాదాలు తెరపైకి వస్తున్నాయి.  అంతే కాదు మా అసోయేషన్ తీరు పై పలువురు నటులు అసంతృప్తి వెలిబుచ్చారు.  ఇక శ్రీ రెడ్డి వివాదం అయితే ఏకంగా మెగా హీరోలు ‘మా’తీరుపై చిర్రుబుర్రులాడిన విషయం తెలిసిందే. 

పవన్ కళ్యాన్, నాగబాబు, అల్లు అర్జున్ మా ఛాంబర్ లో ఈ విషయం గురించి రచ్చ రచ్చ చేశారు.  తాజాగా మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల్లో నటుడు సీనియర్ నరేష్ ప్యానల్ 69 ఓట్లతో గెలిచింది.  ఈసారి ఓటింగ్ శాతం కూడా భారీగానే పెరిగింది. నరేష్ ప్యానల్ చేతిలో ఓడిపోయిన శివాజీరాజా, మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను, శ్రీకాంత్ అసోసియేషన్ లో ఎటువంటి అన్యాయాలు, అక్రమాలకు పాల్పడలేదని చెప్పారు. 

ఎంతోమంది తనను తిరిగి నిలబడాలని కోరితేనే పోటీ చేశానని, తనను ఓడించారని, ఇక తన భార్యతో కలిసి ఊరికి వెళ్లిపోతానని అన్నారు.  తాను ఎవరినీ విమర్శించడం లేదని, ఇష్టం లేకుండానే మీడియా ముందుకు వచ్చానని అన్నారు. న్నికలు జరిగే సమయంలో అసోసియేషన్ వ్యవహారాలపై ఎవరూ మీడియా ముందుకు వెళ్లి మాట్లాడరాదన్న నిబంధన ఉన్నా, ప్రత్యర్థి ప్యానల్ దాన్ని పాటించలేదని ఆరోపించారు. తప్పు చేయాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: