తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సాయిధరమ్ తేజ్. మొదటి చిత్రం రేయ్ అయినా..విడుదల అయ్యింది మాత్రం ‘పిల్లా నువ్వు లేని జీవితం’చిత్రం. ఈ చిత్రంతో మంచి విజయం అందుకున్న సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో మూడు నాలుగు హిట్ చిత్రాలే విజయాన్ని వరించాయి. తర్వాత వచ్చిన చిత్రాలు వరుసగా డిజాస్టర్ అయ్యాయి. మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో చిత్రలహరి అనే చిత్రం చేస్తున్నాడు.
కల్యాణి ప్రియదర్శన్ , నివేద పేతురాజ్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాలో, సునీల్ .. వెన్నెలకిషోర్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ప్రేమకథా చిత్రాలను యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఆయన చాలా బాగా తెరకెక్కిస్తారనే పేరుంది.
రేపు ఉదయం 9గం.లకి టీజర్ని విడుదల చేస్తామని ప్రకటించిన యూనిట్ చిత్రలహరిలోని పాత్రలు మిమ్మల్ని కలుస్తాయంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.