మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ హీరోగా కిశోర్ తిరుమల డైరక్షన్ లో వస్తున్న సినిమా చిత్రలహరి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శి, నివేదా పేతురాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఏప్రిల్ 12న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా టీజర్ కొద్ది గంటల క్రితం రిలీజైంది.


సినిమా టీజర్ మొదట్లోనే దూరదర్శన్ లో ప్రతి శుక్రవారం చిత్రలహరిలో పాటలు ఉంటాయి. ఈ చిత్రలహరిలో కొన్ని పాత్రలు ఉంటాయంటూ వాయిస్ ఓవర్ వస్తుంది. మొదటి పాత్ర నివేదా పేతురాజ్, రెండో పాత్ర కళ్యాణి ప్రియదర్శిని ఇలా పాత్రలను ఇంట్రడ్యూస్ చేస్తూ విజయ్ గా తేజూ కనిపిస్తాడు. నా పేరు విజయ్ పేరులో ఉన్న విజయం జీవితంలో లేదని చెబుతాడు.


లవ్, ఎమోషన్ ఇలా అన్నిటిని సమపాళ్లలో చేస్తూ కిశోర్ తిరుమల అద్భుతంగా ఈ సినిమా చేశాడనిపిస్తుంది. తప్పకుండా ఆడియెన్స్ మెప్పు పొందేలా ఈ మూవీ ఉంటుందని టీజర్ చూస్తేనే తెలుస్తుంది. టీజర్ ఇంప్రెస్ చేయగా సినిమా కూడా తేజూ వరుస ఫ్లాపుల నుండి కాపాడేలా కనిపిస్తుంది. 


తిక్క నుండి తేజ్ ఐలవ్యూ వరకు వరుసగా 6 ఫ్లాపులు ఫేస్ చేసిన సాయి ధరం తేజ్ ఈసారి చిత్రలహరికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా పక్కా హిట్ ఫార్ములాతో వస్తున్నాడు. చిత్రలహరి టీజర్ చాలా ఫ్రెష్ గా ఉంది. తప్పకుండా తేజూ కోరుకునే హిట్ కొట్టే కంటెంట్ ఉందనిపిస్తుంది. సాయి ధరం తేజ్ చిత్రలహరి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: