ప్రస్తుతం టాలీవుడ్ లో ఒకేసారి విశ్వ విఖ్యాత నట సార్వభౌములు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా చేసుకొని బయోపిక్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.  క్రిష్, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో ఎన్టీఆర్ బయోపిక్ నిర్మించారు.  ఈ సినిమా రెండు పార్టులుగా రిలీజ్ చేశారు.  ఎన్టీఆర్ సినీ జీవితంపై ఎన్టీఆర్ కథానాయకుడు, రాజకీయ జీవితంగా ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ చేశారు.  ఎన్టీఆర్ కథానాయకుడు పరవాలేదు అనిపించినా..ఎన్టీఆర్ మహానాయకుడు మాత్రం దారుణంగా డిజాస్టర్ అయ్యింది. 

ప్రస్తుతం సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నిర్మించారు.  ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, లిరికల్ సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ చేసి సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తున్నారు.  అయితే ఈ సినిమాలో ఏపి సీఎం చంద్రబాబుని నెగిటీవ్ గా చూపిస్తున్నట్లు ఉందని టీడీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తెరపైకి మరో ఎన్టీఆర్ బయోపిక్ రాబోతుంది.  తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ టీజర్ ను ఈరోజు విడుదల చేశారు.

ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి ఇంట్లోకి ప్రవేశించగానే దీపాలు ఆరిపోయినట్లు, గద్ద అక్కడే తచ్చాడినట్లు చూపించారు. దీనికి ‘తెలుగింటి గడపపై విరజిమ్మిన విషం’ అనే క్యాప్షన్ ను జతచేశారు.  మరి ఈ సినిమాలో ఎవరిని విలన్ గా చూపించబోతున్నారో అర్థం అవుతుంది.  ఎన్టీఆర్ జీవితంలోకి ల‌క్ష్మీ పార్వ‌తి వ‌చ్చిన త‌ర్వాత ఏం జ‌రిగిందన్నది చూపించనున్నట్లు కేతిరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాలో ల‌క్ష్మీ పార్వ‌తిగా శ్రీ రెడ్డి నటిస్తున్నారు ఆమద్య ప్రకటించారు. నాగరుషి ఫిలిమ్స్ సమర్పణలో, జయం మూవీస్ పతాకంపై కేతిరెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: