కన్నడ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వచ్చిన సినిమా కె.జి.ఎఫ్ చాప్టర్ 1. కన్నడలోనే కాదు తెలుగు, తమిళ, హింది భాషల్లో కూడా ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. తెలుగులో అయితే యశ్ కు క్రేజీ ఫ్యాన్స్ తయారయ్యారు. ఇక కె.జి.ఎఫ్ చాప్టర్ 1 ఇచ్చిన ప్రోత్సాహంతో ఆ సినిమా పార్ట్ 2 అదే కె.జి.ఎఫ్ చాప్టర్ 2 భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.


కె.జి.ఎఫ్ చాప్టర్ 1.. 50 నుండి 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. అయితే ఆ సినిమా 250 కోట్ల దాకా వసూళ్లు సాధించింది. ఇదిలాఉంటే ఇప్పుడు కె.జి.ఎఫ్ చాప్టర్ 2 ను 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారట. యశ్, శ్రీనిధి శెట్టి నటిస్తున్న ఈ సినిమా చాప్టర్ 1 లో ఉన్నవారంతా ఉంటారని తెలుస్తుంది.


ఈరోజు బెంగళూరు కంఠీరవ స్టూడియోలో లాంచనంగా మొదలైన ఈ సినిమా 2020 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే 2020 సమ్మర్ లో ఆల్రెడీ రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. మరి రాజమౌళికి పోటీగా వచ్చి కె.జి.ఎఫ్ నిలబడుతుందా అన్నది చూడాలి.


ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీగా ఆర్.ఆర్.ఆర్ క్రేజ్ తెచ్చుకుంది. బాహుబలి తర్వాత రాజమౌళి రేంజ్ ఏంటన్నది అందరికి తెలిసింది. మరి అలాంటి రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ కు ధీటుగా కె.జి.ఎఫ్ చాప్టర్ 2 వస్తుందట. నిజంగానే కె.జి.ఎఫ్ టీం అంత సాహసం చేస్తుందా అంటే కనీసం రెండు సినిమాలకు కనీసం నెల గ్యాప్ ఉండేలా చూసుకుంటే బెటర్ అంటున్నారు సిని ప్రియులు. 



మరింత సమాచారం తెలుసుకోండి: