సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ భూతం ఇంకా హీరోయిన్స్ ను వేదనకు గురి చేస్తుంది. న్యాయానికి గురైన హీరోయిన్లు అప్పుడప్పుడు తమ బాధలను వెలుగులోకి తెస్తున్నారు. తాజాగా దంగల్ ఫేం ఫాతీమా సనా షేక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను లైంగికంగా వేధించారని ఆమె పేర్కొన్నారు. తనపై జరిగిన వేధింపుల గురించి ఫాతీమా మాట్లాడుతూ. నేను సెక్సువల్ వేధింపుల బాధితురాలినే. నన్ను కూడా దారుణంగా వేధించారు.

 ప్రముఖులపై మీ టూ దెబ్బ

పక్కలోకి వస్తే వేషాలు ఇస్తామన్నారు. నాకు ఎదురైన పరిస్థితులను జాగ్రత్తగా డీల్ చేస్తున్నాను. నాకు ఎదురైన సంఘటనలు చెప్పి నా వ్యక్తిత్వంపై మరక వేసుకొను అని ఫాతీమా సనా షేక్ అన్నారు. నాపై వేధింపులకు పాల్పడిన వారి గురించి నేను బయటకు చెప్పను. వారి భరతం ఎలా పట్టాలో నాకు తెలుసు. నా సన్నిహితులతో చర్చిస్తున్నాను. వారి సహకారం తీసుకొంటున్నాను. ఆ నరకయాతన పడిన క్షణాలకు గుణపాఠం చెబుతాను అని ఫాతీమా పేర్కొన్నారు. 

వారి భరతం పడుతాను

మీ టూ ఉద్యమం తర్వాత భారతీయ సినిమా పరిశ్రమలో పరిస్థితులు మారుతున్నాయి. చాలా మంది ప్రముఖుల్లో గుబులు రేకెత్తుతున్నది. కొందరి పేర్లు బయటకు రావడం, వారి ప్రతిష్ట మంటగలవడంతో ఇతరుల్లో భయం మొదలైంది. సినీ పరిశ్రమలో మహిళలను గౌరవించే సంప్రదాయంలో కొంత మెరుగుగా ఉంది. సాధారణ పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. మీ టూ ఉద్యమంలో భాగంగా ప్రముఖ నటులు సాజిద్ ఖాన్, అలోక్ నాథ్, కైలాష్ ఖేర్, వికాస్ బెహల్, నానా పాటేకర్ లాంటి పేర్లు బయటకు రావడం సంచలనం రేపాయి. చాలా మంది హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్లు తమపై జరిగిన వేధింపులను బయటపెట్టిన సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: