ప్రస్థుత పరిస్థితులలో ఒక హీరోయిన్ టాప్ రేంజ్ లో 5 ఏళ్ళు కొనసాగడమే పెద్ద అద్భుతంగా మారింది. అలాంటి పరిస్థితులలో అనుష్క ఫిలిం ఇండస్ట్రీలో 14 ఏళ్ళు కొనసాగడం మామూలు విషయం కాదు. అనుష్క ఫిలిం ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి 14ఏళ్ళు పూర్తి అయిన సందర్భంలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున పూరి జగన్నాథ్ లపై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది.
తాను సినిమాల్లోకి రావాలని ఎప్పుడు అనుకోలేదు అంటూ సూపర్ సినిమా కోసం పూరి జగన్నాధ్ హీరోయిన్ కోసం చూస్తుంటే తనకు తెలిసిన ఒక స్నేహితుడు ద్వారా పూరి నుండి తనకు పిలుపు వచ్చిన విషయాన్ని వివరించింది. అయితే తాను ఆమూవీలో సెలెక్ట్ అయినా ఆ షూటింగ్ వాతావరణం చూసి తనకు చికాకు కలిగి సినిమాల నుండి వెళ్ళిపోవాలి అని భావించిన విషయాలను వివరించింది.
అయితే కెమెరా చూసి భయపడిపోయే తనకు నటన విషయంలో ధైర్యం చెప్పింది నాగార్జున పూరి జగన్నాథ్ లు మాత్రమే అంటూ అప్పటి విషయాలను గుర్తుకు చేసుకుంది అనుష్క. అంతేకాదు తాను జీవితాంతం వారిద్దరికీ ఋణపడి ఉంటాను అంటూ అనుష్క చేసిన కామెంట్స్ ఆమె కృతజ్ఞతను తెలుపుతున్నాయి.
'భాగమతి' తర్వాత అనుష్క గ్యాప్ తీసుకుని తన లావు తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. దీనితో సినిమాలు బాగా తగ్గించుకున్న అనుష్క ప్రస్తుతం నటిస్తున్న ‘సైలెన్స్’ మూవీ పై అంచనాలు ఉన్నాయి. ఈమూవీతో పాటు అయ్యప్ప స్వామి మహిమలకు సంబంధించి ఒక ప్రముఖ దర్శకుడు తీయబోతున్న మూవీలో అనుష్క కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాక్..