టాలీవుడ్ లో ఇప్పుడు అక్కినేని సమంత అంటే ఎంతో క్రేజ్ ఉంది.  గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘ఏం మాయ చేసావే’సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన సమంత అందులో నటించిన సహనటుడు అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది.  వీరి వివాహం జరిగి యేడాది అవుతుంది. పెళ్లైన మూడు నెలల నుంచి సమంత నటించడం మొదలు పెట్టి వరుస హిట్స్ అందుకుంది.  ప్రస్తుతం అక్కినేని వారి కోడలు కావడంతో అటు మీడియా..ఇటు సినీ పరిశ్రమలో సమంతకు ఎంతో గౌరవం..బాధ్యతలు కూడా పెరిగాయి. 

ప్రస్తుతం ఆమె కుర్ కురే స్నాక్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. ఈ క్రమంలో కుర్ కురే ప్యాకెట్ పట్టుకొని ఫోటోకి ఫోజిచ్చి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో కొంత మంది నెటిజన్లు సమంత పై ఫైర్ అయ్యారు.  ఒక గొప్ప ఇంటి కోడలివి..మంచి హీరోయిన్  అయిన నువ్వు  కోసం ఇలాంటి అనారోగ్యమైన ఆహారాన్ని ప్రోత్సహిస్తావా..? అంటూ ఆమెపై మండిపడ్డారు. ఓ నెటిజన్ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే నువ్వు ఇలా హాని కలిగించే ఫుడ్ తినమని ప్రచారం  ఎంత వరకు న్యాయం అంటూ ప్రశ్నించారు. 

ఈ ట్విట్స్ పై స్పందించిన సమంత నేను ప్రతి ఆదివారం తినే మీల్స్ ఫోటోని మీకు పంపిస్తా.. అవును.. నేను ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటాను. అదే విధంగా  ఓ సామాన్యురాలిగా ఇలాంటి స్నాక్స్ తీసుకోవడం ఇష్టం. ఈ బ్రాండ్ స్నాక్స్ తో పాటు మీరు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెబుతుంది'' అంటూ నెటిజన్లపై మండిపడింది.



మరింత సమాచారం తెలుసుకోండి: