టాలీవుడ్ లో రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..ఓటమి ఎరుగని దర్శకధీరుడు అని పేరు ఉంది.  ఆయన తీసిన బాహుబలి, బాహుబలి 2 సినిమాలతో ఏకంగా జాతీయ, ప్రపంచ స్థాయిలో తెలుగోడి సత్తా ఏంటో చూపించారు.  ప్రస్తుతం ఎన్టీఆర్, రాంచరణ్ లతో మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ (వర్కింగ్ టైటిల్) సినిమా తీస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ ని నిర్వహించింది చిత్రబృందం. ఈ సందర్బంగా రాజమౌళి ఎన్నో విషయాలు ఆడియన్స్ కి తెలియజేశారు. 
Image result for rrr movie press meet
మనం ఇప్పటి వరకు ఎంతోమంది స్వాతంత్ర వీరుల గురించి తెలుసుకున్నాం.  అందులో శాంతి యుతంగా ఉన్నారు..దాడికి ప్రతిదాడే అన్నవారూ ఉన్నారు. అలాంటి వారిలో అల్లూరి సీతారామరాజు.  ఆయన 1897 లో ఆంధ్ర ప్రాంతంలో జన్మించారు.  చిన్ననాటి నుంచి చదువుతో పాటు అన్ని విషయాల్లో ఎంతో నేర్పరి.  యుక్త వయసులో ఉండగా ఆయన ఇల్లు వదిలి వెళ్లిపోయారు.  తర్వాత తన ఇంటికి చేరుకున్న తర్వాత స్వాతంత్ర ఉద్యమాన్ని చేపట్టారు. మన్యం వీరుడిగా బ్రిటీష్ వారి చేతిలో చనిపోయారు.  ఇక తెలంగాణ విషయానికి వస్తే..1901 లో కొమరం భీం పుట్టారు. ఈయన కూడా యుక్త వయసులో ఇంటి నుంచి వెళ్లిపోయి..తర్వాత తన గూడానికి వచ్చి పోరాటం చేశారు. 
Image result for rrr movie press meet
అప్పటి బిట్రీష్ పోలీసుల చేతిలో చనిపోయాడు. ఇద్దరూ ఒకే టైం లో పుట్టడం, ఇంటి నుండి వెళ్లిపోవడం, తిరిగొచ్చి ఒకేవిధంగా పోరాడడం అమరులు కావడం అనేది నాకు ఆశ్చర్యం కలిగించింది. నా కథ ఈ క్యారెక్టర్లకు దగ్గరగా ఉండబోతుందని  అన్నారు.  ఇదే నేపథ్యంలో స్వాతంత్రం కోసం పోరాటం జరుగుతున్న సమయంలో ఇద్దరు వీరులు ఒకరి గురించి ఒకరు ప్రభావితమై వాళ్ల మద్య స్నేహం ఏర్పడితే ఎలా ఉంటుందని విషయమే  ఈ సినిమా.  నా సినిమా కంప్లీట్ గా ఫిక్షనల్ గా ఉంటుంది.

1920 లో జరిగే కథ కాబట్టి చాలా రీసెర్చ్ చేశామని చెప్పారు.  ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగాన్ ముఖ్యపాత్రలో నటించబోతున్నారు.  రాంచరణ్ సరసన ఆలియాభట్, ఎన్టీఆర్ సరసన డేజీ అడ్గారియన్స్ నటిస్తున్నారు.  'RRR' వర్కింగ్ టైటిల్ అనుకున్నాం.. అదే బావుందని అన్నారు. అన్ని భాషల్లో ఇది కామన్ గా ఉంటుంది. ఇక ఈ సినిమాలో  యంగర్ వెర్షన్ ఆఫ్ అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీం గా తారక్ కనిపించబోతున్నారు'' అంటూ చెప్పుకొచ్చారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: