టాలీవుడ్ లో చాలా రోజులుగా ఊరించి ఊరించి..ఈ రోజు సస్పెన్స్ కి తెరదించారు ఎస్ ఎస్ రాజమౌళి. బాహుబలి 2 తర్వాత సంవత్సరం గ్యాప్ తీసుకున్న ఆయన నేడు ప్రెస్ మీట్ రాజమౌళి మరో ప్రతిష్టాత్మ సినిమా తీస్తున్నారు. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్. ఈ సినిమా పై గత కొంత కాలంగా ఎన్నో రూమర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ వచ్చాయి. అయితే వీటీన్నింటికీ చెక్ పెడుతూ.. రాజమౌళి సరికొత్త అంశాన్ని ఆడియన్స్ కి తెలిపారు.
ఈ సినిమా 1920 కాలం నాటిదని..అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్.. కొమరంభీమ్ గా ఎన్టీఆర్ నటించబోతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ..ఇది జక్కన్నతో నాల్గో సినిమా. రాజమౌళితో పని చేయడం, చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ సినిమా నా కెరీర్ లో దిబెస్ట్ మూవీగా మిగిలిపోతుందని అన్నారు.
అయితే చెర్రీతో నాకు ఇప్పటి బంధం కాదని..నా కష్టసుఖాల్లో పాలుపంచుకునే స్నేహితుల్లో ఒకరని అన్నారు. ఈ సినిమా మేమిద్దరం కలిసి చేసేసరికి మా స్నేహం వేరే లెవెల్ కి వెళ్లిపోయింది. ఈ స్నేహం ఎప్పటికీ ఇలానే ఉండాలని దేవుడిని కోరుకుంటున్నాను. మా బంధానికి దిష్టి తగలకూడదని అన్నారు. ఈ సినిమా నాకు చరణ్ కి, నటులుగా ఎదగడానికి ఎంతో హెల్ప్ చేస్తుంది. ఇది గొప్ప సినిమాగా నిలిచిపోతుందని నా నమ్మకం అంటూ చెప్పుకొచ్చారు.