ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ మైత్రి మూవీస్ బ్యానర్ పై సినిమా చేస్తాడు అని భావించారు అంతా. అయితే ‘అజ్ఞాతవాసి’ షాక్ తో పవన్ కు సినిమాలు అంటే భయం ఏర్పడేలా పరిస్థితులు ఏర్పడ్డాయి. దానితో పవన్ మూవీస్ పట్ల విరక్తి పెంచుకుని సినిమాలు చేయడం కంటే రాజకీయాలు సులువు అని భావించి ప్రస్తుతం రాబోతున్న ఎన్నికల కోసం జనం మధ్య తిరుగుతున్నాడు పవర్ స్టార్. 
Pawan Kalyan
ఇలాంటి పరిస్థుతులలో పవన్ కోసం తయారు చేయబడ్డ కథ ఎట్టకేలకు మరొక హీరో సహాయంతో సెట్స్ పైకి వచ్చింది. తమిళంలో హిట్ అయిన ‘ధేరీ’ మూవీ స్క్రిప్ట్ కు తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా ముఖ్యంగా పవన్ అభిమానులకు అనుగుణంగా మార్పులు చేయబడ్డ కథకు ఇప్పుడు రవితేజ మోక్షం కలిగించడం హాట్  టాపిక్ గా మారింది.
Pawan Kalyan
ఈ మూవీ కధను నమ్ముకుని దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ పడ్డ కష్టానికి ఇప్పుడు ఫలితం వచ్చింది. ఈమూవీకి ‘కనక దుర్గ’ అన్న టైటిల్ ఫిక్స్ చేసి త్వరలో షూటింగ్ ప్రారంభించబోతున్నారు. వాస్తవానికి ఈ మూవీ ఇప్పటికే ‘పోలీసోడు’ అన్న పేరుతో తెలుగులో డబ్ అయి విడుదల అయిన నేపధ్యంలో ఈ తమిళ రీమేక్ లో నటించడానికి రవితేజా పెద్దగా ఆసక్తి కనపరచలేదు అన్న వార్తలు గతంలో వచ్చాయి. 

అయితే సంతోష్ శ్రీనివాస్ ఈ మూవీ స్క్రిప్ట్ విషయంలో చేసిన మార్పులు రవితేజాకు బాగా నచ్చడంతో ఎట్టకేలకు ఈమూవీకి మాస్ మహారాజ క్లియరెన్స్ ఇచ్చినట్లు సమాచారం. తెలుస్తున్న సమాచారం మేరకు రవితేజ ప్రస్తుతం డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వంలో నటిస్తున్న ‘డిస్కో రాజ’ మూవీతో సమాంతరంగా పవన్ వదులుకున్న మూవీని రవితేజా నటించబోతున్నట్లు టాక్. ఏది ఏమైనా పవన్ ఇచ్చిన షాక్ కు అయోమయంలో పడిపోయిన సంతోష్ శ్రీనివాస్ కు రవితేజ సహాయం చేస్తున్నాడు అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: