నిన్న రాజమండ్రిలో జరిగిన ‘జనసేన’ ఆవిర్భావ మహోత్సవానికి సంబంధించి ఏర్పాటు చేయబడ్డ బహిరంగ సమావేశానికి విపరీతమైన ప్రజాస్పందన రావడం పవన్ అభిమానులకు జోష్ ను ఇచ్చింది. ఈ సమావేశాన్ని చూడటానికి వ్యక్తిగతంగా రాజమండ్రి వెళ్ళిన నాగబాబు ఆ బహిరంగ సమావేశం తరువాత మీడియాతో మాట్లాడుతూ పవన్ ఉపన్యాసం విని తాను ఎలా ఉద్వేగ భరితం అయిన విషయాన్ని వివరించాడు. 
ఎందుకు ఇంత కష్టం అని బాధ పడ్డాం
జనం మధ్య తన తమ్ముడు ఉపన్యాసం ఎలా ఇస్తాడు అన్న విషయం ప్రత్యక్షంగా చూడాలని తాను ఎప్పటి నుంచో కోరుకుంటున్నప్పటికీ నిన్నటి రోజున తాను జనం మధ్య ఉండి పవన్ ఉద్వేగంతో మాట్లాడుతున్నప్పుడు జనం నుంచి వచ్చిన స్పందన చూసి తాను ఉద్వేగానికిలోనైన విషయాన్ని బయటపెట్టాడు. పవన్ రాజకీయ పార్టీ పెట్టినప్పుడు పవన్ లాంటి నిజాయితీ పరుడైన వ్యక్తికి రాజకీయాలు ఎందుకు అని తాను బాధపడిన విషయాలను వివరిస్తూ ఈరోజు పవన్ రాజకీయాలలోకి వచ్చినందుకు గర్వపడుతున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. 
నా నమ్మకం నిజమైంది
పవన్ రాజకీయాలలో సక్సస్ అవుతాడు అన్న నమ్మకం నిన్నటి రాజమండ్రి మీటింగ్ తనకు కలగచేసింది అంటూ పవన్ రానున్న ఎన్నికలలో సంచలనాలు సృష్టించడం ఖాయం అని అంటున్నాడు. అదేవిధంగా పవన్ లాంటి వ్యక్తిత్వం గల వ్యక్తులు సమాజంలో 100 సంవత్సరాలకు ఒకసారే పుడతారు అంటూ నాగబాబు చేసిన కామెంట్స్ షాకింగ్ గా మారాయి. 
Nagababu
దీనికితోడు నిన్నటి సమావేశానికి తాను వచ్చే సందర్భంలో తన అన్న చిరంజీవి ఆశిస్సులు కూడ పవన్ కళ్యాణ్ కు తీసుకు వచ్చాను అంటూ నాగబాబు చేసిన కామెంట్స్ బట్టి పరోక్షంగా ‘జనసేన’ కు మెగా ఫ్యామిలీ అండ ఉంది అన్న సంకేతాలు మరొకసారి స్పష్టం చేస్తున్నాయి. ఏది ఎలా ఉన్నా నిన్నటి పవన్ ఉపన్యాసం అనవసరమైన ఆవేసాలకు విమర్సలకు తావు ఇవ్వకుండా తాను అధికారంలోకి వస్తే ఏమి చేస్తాను అన్న విషయం పై స్పష్టత ఇవ్వడానికి సుమారు గంటన్నర పాటు ప్రసంగించిన పవన్ ఉన్యాసం కొనసాగింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: