బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఎన్.టి.ఆర్, రాం చరణ్ నటించడమే కాకుండా ఈ సినిమా కథ ఇద్దరు రియల్ హీరోస్ స్టోరీ అని చెప్పడంతో ఇంకాస్త క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమాలో రాం చరణ్ కు జోడీగా అలియా భట్.. తారక్ కు జతగా డైసీ ఎడ్గర్ జోన్స్ నటిస్తున్నారు.  


బాలీవుడ్ లో తన టాలెంట్ తో సత్తా చాటుతున్న అలియా భట్ చేస్తున్న ప్రతి సినిమాలో తన నటనతో మంచి మార్కులు సంపాదిస్తుంది. అందుకే రాజమౌళి ఏరికోరి మరి అలియా భట్ ను ఆర్.ఆర్.ఆర్ లో తీసుకున్నారు. అయితే ముందునుండి ఈ సినిమాలో అలియా ఉంటుందని వార్తలు వచ్చాయి.


రాజమౌళి సినిమాలో తాను చేసేందుకు సిద్ధమే కాని అందుకు తగిన రెమ్యునరేషన్ కూడా కావాల్సిందే అని చెప్పిందట అలియా భట్. మాములుగా బాలీవుడ్ లో సినిమాకు 4, 5 కోట్ల దాకా తీసుకునే అలియా భట్ ఆర్.ఆర్.ఆర్ కోసం 10 కోట్లు దాకా చెప్పిందట. అయితే 7, 8 కోట్లకు సెట్ చేశారని తెలుస్తుంది.


అంటే బాలీవుడ్ లో చేసే సినిమా కన్నా డబుల్ రెమ్యునరేషన్ ఇస్తే తప్ప తెలుగు సినిమాలో చేయనని చెప్పింది. అలియా భట్ వల్ల సినిమా మార్కెట్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఆమెకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా పర్వాలేదు. డైసీ ఎడ్గర్ జోన్స్ కు భారీ రెమ్యునరేషన్ ఇచ్చి ఈ సినిమాకు తీసుకున్నారట. మొత్తానికి రాజమౌళి మరో అద్భుత సినిమా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సర్వం సిద్ధం చేశాడు.  



మరింత సమాచారం తెలుసుకోండి: