ఈ మద్య సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు సంబంధించి వస్తున్న వార్తలు చూస్తుంటే నవ్వాలో ఏడ్వాలో అర్థం కాని పరిస్థితి.  బతికి ఉండగానే చనిపోయినట్లు వస్తున్న వార్తలు చూస్తుంటే సెలబ్రెటీలు తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది.  గతంలో పలువురు నటీనటులు చనిపోయినట్లు వార్తలు ఎన్నో సంచలనాలు క్రియేట్ చేశాయి.  తాజాగా టాలీవుడ్ హీరో, ప్రముఖ కమెడియన్ సునీల్ చనిపోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.

టాలీవుడ్ హీరో సునీల్ ఈరోజు కారు ప్రమాదంలో మరణించారని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.  ఆయన్ను కడసారిగా చూసేందుకు టాలీవుడ్ ప్రముఖులు వచ్చినట్లు మార్ఫింగ్ ఫొటోలను వాటికి జతచేశారు.  అవి కాస్త వైరల్ కావడంతో ఆయన కుటుంబ సభ్యులు టెన్షన్ కి గురయ్యారు. ఈ విషయం కాస్త సునీల్ దృష్టికి వెళ్లడంతో షాక్ కి గురయ్యారు. 

సునీల్  ట్విట్టర్ లో స్పందించాడు. ఇలాంటి వార్తలను నమ్మవద్దనీ, తాను క్షేమంగా ఉన్నానని సునీల్ తెలిపాడు. దయచేసి ఇలాంటి కథనాలతో ఆందోళనకు గురికావద్దనీ, వీటిని నమ్మవద్దని విజ్ఞప్తి చేశాడు.  అయినా ఇలాంటి దారుణమైన వదంతులు సోషల్ మీడియాలో ఎలా ప్రచారం చేస్తారో అర్థం కావడం లేదని ఆయన వాపోయారు. సదరు నకిలీ వదంతికి సంబంధించిన క్లిప్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: