టాలీవుడ్ లో పూరి జగన్నాథ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ‘టెంపర్’సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఇంట్రవెల్ వరకు నెగిటీవ్ షేడ్స్ లో కనిపిస్తాడు. ఆ తర్వాత నేరస్తుల గుండెల్లో సింహస్వప్నంగా మారుతాడు. ఈ సినిమాకు కోర్టు సీన్ హైలెట్ గా నిలిచింది. బాలీవుడ్ లో ఈ సినిమా సింబా గా రిలీజ్ అయ్యింది. ఇందులో బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ నటించాడు. ఇక కోలీవుడ్ లో ‘అయోగ్య’సినిమాగా రూపొందుతుంది.
ఈ సినిమాలో విశాల్ హీరోగా నటిస్తున్నాడు. వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నాడు. విశాల్ సరసన రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఏప్రిల్ 19వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా ముందుగా ప్రకటించారు. అయితే ఈ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ ఉంచాలని భావించారు. సరైనోడు సినిమాలోని బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టరే సాంగ్ ని ‘అయోగ్య’లో ఐటమ్ సాంగ్ గా తీసుకున్నారు.
ఇటీవల్ ఈ సాంగ్ షూటింగ్ లో విశాల్ కాలికి గాయం కావడంతో కొంత కాలం రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. దాంతో షూటింగ్ కి అంతరాయం ఏర్పడింది. ఈ కారణంగా ముందుగా అనుకున్న సమయానికి షూటింగు పూర్తిచేయలేకపోతున్నందు వలన విడుదల తేదీని వాయిదా వేశారు. ఇక తమిళంలో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న లారెన్స్ నటిస్తున్న ‘కాంచన 3’