సినిమాలకూ రాజకీయాలకు దక్షిణాదిలో అవినాభావ సంబంధం ఉంది. తెలుగు విషయానికి వస్తే.. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఎక్కువగా సినీ జనం ఉండేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. కొన్నాళ్లుగా వైసీపీలోకి సినీ నటుల రాక జోరు పెరిగింది.
తాజా ఎన్నికల విషయానికి వస్తే.. సినీనటి రోజా మరోసారి నగరి నుంచి బరిలో దిగుతున్నారు. ఇటీవలే ఆ పార్టీలో చేరిన సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్.. అదేనండీ.. పీవీపీ విజయవాడ బరిలో ఉన్నారు. మరికొందరు ఎన్నికల్లో పోటీ చేయకపోయినా వైసీపీకి అండగా నిలుస్తున్నారు.
30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ వైసీపీ తరపున గట్టిగా పోరాడుతున్నారు. పార్టీ ప్రచారాల్లోనూ, సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉన్నారు.
ఇక ప్రముఖ కమెడియన్ అలీ మూడు పార్టీలతో సంప్రదింపులు జరిపి.. చివరకు వైసీపీ వైపే మొగ్గారు. గుంటూరు జిల్లా నుంచి పోటీకి ఆసక్తి చూపిన అలీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం విచిత్రమే.
ఇక వీరే కాకుండా జయసుధ, రాజా రవీంద్ర, దాసరి అరుణ్, హీరో భానుచందర్, నటుడు కృష్ణుడు వైసీపీలోనే ఉన్నారు.
రైటర్ కమ్ యాక్టర్ పోసాని కృష్ణమురళి కూడా వైసీపీ కోసం గట్టిగానే కృషి చేస్తున్నారు. మరి వీరంతా వైసీపీ విజయానికి ఏమాత్రం కష్టపడతారో చూడాలి.