తెలుగు ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు విలక్షణ నటుడిగా ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నారు.  సీనియర్ నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ లతో నటించిన ఆయన విలన్ గానే కాదు..మంచి హీరోగా మెప్పించారు. నటుడిగా, దర్శకుడిగా..నిర్మాత,విద్యావేత్త, రాజకీయ నాయకుడిగా అన్ని రంగాల్లో తనదైన సత్తా చాటుతున్నారు. 

ఆయన తనయులు మంచు విష్ణు, మంచు మనోజ్ లు హీరోలుగా కొనసాగుతున్నారు..మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి నటిగా, నిర్మాతగా,బుల్లితెర యాంకర్ గా కొనసాగుతున్నారు.  ఇక మంచు మనోజ్ సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటుంటారు. అంతే కాదు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టీవ్ గా ఉంటారు మంచు మనోజ్. 

తాజాగా తన తండ్రి మోహన్ బాబు 69వ పుట్టినరోజును పురస్కరించుకుని సిరిసిల్ల ప్రాంతానికి చెందిన అశ్విత అనే బాలికను దత్తత తీసుకున్నాడు. ఈ సందర్భంగా మంచు మనోజ్ పాప బాధ్యతలన్నీ తానే స్వయంగా చూసుకుంటానని..పాప ఐఏఎస్ అధికారి కావాలన్నదే లక్ష్యం అని..తిరుపతిలోని తమ సొంత విద్యా సంస్థ శ్రీ విద్యానికేతన్ చేర్పించి ఆమె పూర్తి బాధ్యతలు తానే తీసుకుంటానని ఈ సందర్భంగా మనోజ్ ట్వీట్ చేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: