తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలకు షాక్ తగిలింది. లక్ష్మిస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీర గంధం సినిమాల విడుదలను ఆపాలని వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో మేము కలగజేసుకోలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. రెండు సినిమాల్లో సన్నివేశాలు ఏవైనా అభ్యంతరకరంగా ఉంటే వాటిపై చర్యలు తీసుకోవాలి అని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం వెలువరించింది.
తెలంగాణాలో సినిమా విడుదల చేసినా ఎలాంటి ఇబ్బంది లేదని హైకోర్టు స్పష్టం చేసింది. లా అండ్ ఆర్డర్ ఇబ్బంది కలగకుండా తమ పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటారని తెలంగాణా అడ్వకేట్ జనరల్ తెలిపారు. దీంతో సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ న్యాయ స్థానం ఆదేశాలు ఇచ్చింది.