తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో ఆయన మేనళ్లడు సాయిధరమ్ తేజ్ ‘పిల్లా నువ్వు లేని జీవితం’చిత్రంతో మంచి హిట్ అందుకున్నాడు.  మొదటి చిత్రంతోనే మెగా హీరో అంటే ఎలా ఉండాలో చూపించిన సాయిధరమ్ తర్వాత సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ చిత్రాలలో మాస్ కి బాగా కనెక్ట్ అయ్యాడు.  ఆ తర్వాత వచ్చిన చిత్రాలు పెద్దగా హిట్ కాలేదు. 

తాజాగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా‘చిత్రలహరి’లో నటిస్తున్నాడు.  ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శిని .. నివేదా పేతురాజ్  హీరోయిన్లుగా నటిస్తున్నారు.  మరో ముఖ్య పాత్రలో సునీల్ నటిస్తున్నాడు.  ఈ మద్య చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యింది.  తాజాగా ఫస్టు లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.

"పరుగు పరుగు వెళుతున్నా ఎటు వైపు .. జరుగు జరుగు అంటుంది లైఫు. ఎంత పెంచుకుంటున్నా నా వేగం .. నన్ను దాటిపోతుందే లోకం" అంటూ డేవిడ్ సైమన్ పాడిన ఈ పాట సాగుతోంది. మైత్రీమూవీ మేకర్స్ వారు నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది


మరింత సమాచారం తెలుసుకోండి: