టాలీవుడ్ లో వరుసగా విజయాలు అందుకుంటున్న దర్శకుడు అనీల్ రావిపూడీ ఈ సంక్రాంతికి విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో ‘ఎఫ్ 2 ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా అనుకున్నదానికన్నా రెట్టింపు విజయం సాధించింది. ఈ సినిమా విజయం తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఓ సినిమా తీస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కాగా ఆ మూవీ కీలక పాత్రలో విజయశాంతి ని తీసుకోవాలని అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి.
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా చెలామణి అయిన విజయశాంతి తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకుంది. తెలుగులో స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని ఇమేజ్ ని సొంతం చేసుకుంది. కానీ కొద్ది రోజుల్లోనే అనుకోకుండా అవకాశాలు తగ్గడం రాజకీయల్లోకి రావడం జరిగిపోయాయి. అప్పటి నుంచి ఆమె మళ్లీ తెరపై కనిపించలేదు. అయితే విజయశాంతిని మళ్ళీ సినిమాల్లోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేసారు అనిల్ రావిపూడి.
గతంలో కృష్ణ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన కొడుకు దిద్దిన కాపురం చిత్రం లో విజయశాంతి ,మహేష్ బాబు నటించారు అందులో విజయశాంతి హీరోయిన్ కాగా మహేష్ బాబు ద్విపాత్రాభినయం పోషించాడు. ఈ నేపథ్యంలో విజయశాంతిని మళ్ళీ సినిమాల్లోకి నటింపజేయాలని అనీల్ రావిపూడి ప్రయత్నించారు. కానీ అయితే విజయశాంతి నో చెప్పారట. ప్రస్తుతానికి తనకు నటించే ఉద్దేశం లేదంటూ నైస్ గా తప్పించుకుందట.