భారత దేశంలో లంచగొండి తనం పెరిగిపోతుందని..దాన్ని అరికట్టాలని ఇప్పటి వరకు ఎన్నో చిత్రాలు వచ్చాయి.  ఇదే అంశంపై విశ్వనటుడు కమల్‌హాసన్‌, దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో  ‘భారతీయుడు’చిత్రం అప్పట్లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది.  ఈ చిత్రం మంచి హిట్ అందుకున్న తర్వాత సీక్వెల్ తీయాలని చాలా సార్లు అనుకున్నా ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది.  ఇటీవల కమల్‌హాసన్‌, శంకర్‌ ‘ఇండియన్‌2’ చిత్రానికి శ్రీకారం చుట్టారు.  కమల్ సరసన నాయికగా కాజల్ కనిపించనుంది.  ‘ఇండియన్‌2’  మొదలు పెట్టినప్పటి నుంచి రక రకాల ఇబ్బందులు వచ్చిపడుతున్నాయి.

ఈ చిత్రం తొలి షెడ్యూల్ సమయంలోను .. ఆ తరువాత షూటింగు విషయంలో గ్యాప్ ఎక్కువగా వస్తోంది. అనుకున్నట్టుగా షూటింగు జరగకపోవడంతో, దర్శక నిర్మాతల మధ్య మనస్పర్థలు వచ్చాయంటూ వార్తలు వచ్చాయి.  ఆ తర్వాత కమల్ మేకప్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని వార్తలు వచ్చాయి.  వృద్ధుడిగా మేకప్ వేసిన ప్రతిసారి స్కిన్ అలర్జీతో ఇబ్బంది పడుతున్నారట.అందువల్లనే షూటింగ్ ఆపారని అంటున్నారు.

తాజాగా ఈ చిత్రంపై మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కమల్‌హాసన్‌ లోక్‌సభ ఎన్నికల బిజీలో పడి పోయారు. దీంతో ‘ఇండియన్‌2’ షూటింగ్‌ పునఃప్రారంభమయ్యేందుకు మరింత ఆలస్యం కావొచ్చని చెబుతున్నారు. మొత్తానికి తమిళనాట ఎన్నికలు పూర్తయ్యే వరకు ‘ఇండియన్‌2’ మొక్షం లేదనే చెప్పాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: