బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ నటించిన మూవీ ‘కేసరి’ రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే నెట్ లో ప్రత్యక్షం కావడంత చిత్ర యూనిట్ ని కలవరపరిచింది.  1897లో బ్రిటీష్ ఇండియన్ బృందాలకు, ఆఫ్ఘనిస్థాన్ బృందాలకు మధ్య జరిగిన సరాగర్హి యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కింది . అనురాగ్ దర్శకత్వం వహించారు.  ఈ సినిమా నిన్న( మార్చి 21) ప్రపంచ వ్యాప్తంగా విడుద‌లైంది. రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో హిట్ టాక్ రావడంతో కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి.  కానీ పైరసీ భూతం ఈ సినిమా విడువలేదు.

కేస‌రి  ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అక్షయ్ కుమార్ ఈ సినిమాలో తన విశ్వరూపం చూపించారు.  దాంతో  ప్రేక్ష‌కులు థియేట‌ర్స్ ద‌గ్గ‌ర క్యూ క‌డుతున్నారు. తొలి రోజు ఈ మూవీ 21.77 కోట్ల వ‌సూళ్ళు సాధించింద‌ని బాలీవుడ్ టాక్. అంతే కాదు ఈ సంవత్సరం బాలీవుడ్‌లో తొలి రోజు భారీ క‌లెక్ష‌న్స్ సాధించిన మూవీగా కేస‌రి నిలిచింది. ప్ర‌స్తుతం ఈ సినిమా స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ అవుతుండ‌గా, త‌మిళ రాక‌ర్స్ సంస్థ ఈ మూవీని పైర‌సీ చేసి ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసింది. 

గతంలో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయిన వెంటనే పైరసీ చేస్తామని చెప్పి మరీ త‌మిళ రాక‌ర్స్ సంస్థ నెట్ లో రిలీజ్ చేశారు.  ఆ మద్య శంకర్, రజినీకాంత్ నటించిన 2.0 సినిమా పరిస్థితి కూడా ఇంతే.  గ‌తంలో బాలీవుడ్ లో గ‌ల్లీ భాయ్, మ‌ణిక‌ర్ణిక‌,సింబా, టోట‌ల్ ఢ‌మాల్ వంటి సినిమాలు పైర‌సీ బారిన ప‌డిన సంగ‌తి  తెలిసిందే. ఇలాంటి పైరసీల వల్ల కలెక్షన్లపై ఎఫెక్ట్ పడుతుందని చిత్ర యూనిట్ భావిస్తుంది.   మూవీ రిలీజ్ అయిన త‌ర్వాతి రోజే చిత్రం ఆన్‌లైన్‌లో ప్ర‌త్య‌క్షం కావ‌డంతో నిర్మాత‌లు గ‌గ్గోలు పెడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: