ఈ మద్య సెలబ్రెటీలకు సంబంధించిన విషయాలో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.  అయితే ఈ వార్తలు పాజిటీవ్ కన్నా నెగిటీవ్ గానే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. దాంతో ఆ వార్తల్లో నిజం లేదు మహాప్రభో అంటూ ఖండిస్తున్నారు సెలబ్రెటీలు.  తాజాగా జయం సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయిన నితిన్ తర్వాత దిల్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు.  ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేళ్లు దాటినా..నితిన్ కి సరైన హిట్ మాత్రం లేదు. కాకపోతే హీరోగా తన కెరీర్ కి ఎప్పుడూ ఇబ్బంది రాలేదు. 


ఆ మద్య త్రివిక్రమ్ దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా అ..ఆ...మంచి హిట్ అయ్యింది.  ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఫ్లాపులే.  వెంకీ కుడుముల దర్శకత్వంలో 'భీష్మ' సినిమాలో నటిస్తున్నాడు.  ఈ నేపథ్యంలో రమేశ్ వర్మ దర్శకత్వంలో నితిన్ ఓ సినిమా చేయనున్నాడనీ .. ఆగస్టు నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందనే ప్రకటన ఒకటి నిన్న వచ్చింది.  కొద్ది సేపటి తర్వాత  తాను భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై రాబోతున్న చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు, ఈ సినిమా ఏప్రిల్ నుంచి చిత్రీకరణ జరుపుకోనున్నట్లు నితిన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో అభిమానులు తికమకపడుతున్నారు.  


రమేశ్ వర్మతో సినిమాను గురించి ప్రస్తావించకపోవడం అభిమానులను అయోమయానికి గురిచేసింది. తాజాగా ఈ విషయాలపై నితిన్ స్పందిస్తూ..నేను చేయబోయే సినిమాలకి సంబంధించిన విషయాలను నా సోషల్ మీడియా ద్వారా అప్ డేట్ చేస్తుంటాను .. ఫేక్ న్యూస్ ను నమ్మకండి" అని స్పష్టం చేశాడు. దాంతో నితిన్ ఓకే  చెప్పకముందే రమేశ్ వర్మ అత్యుత్సాహం చూపించాడని చెప్పుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: