ఈ మద్య మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన తమిళ హీరో ఆర్య,  సాయోషా సైగ‌ల్ ప్రస్తుతం హ‌నీమూన్‌ని ట్రిప్ లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. హ‌నీమూన్ కోసం విదేశాలకి వెళ్లిన వారు తమ జీవితంలో తీపి గుర్తుగా ఎన్నో ఫోటోలు దిగుతున్నారు.  తెలుగు ఇండస్ట్రీలో వివివినాయక్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని నటించిన ‘అఖిల్’చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.  ఆ తర్వాత బాలీవుడ్ లో అజయ్ దేవగాన్ నటించిన  శివాయ్‌లో నటించింది. 
Related image
ప్రస్తుతం తమిళ, మళియాళ చిత్రాల్లో నటిస్తుంది. 2018లో వ‌చ్చిన గ‌జినీకాంత్ అనే చిత్రంలో తొలిసారి ఆర్య‌, సాయేషా క‌లిసి న‌టించారు. ప్ర‌స్తుతం సూర్య‌-కేవీ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న క‌ప్పం చిత్రంలో న‌టిస్తున్నారు.  ఈ చిత్రంలో మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.  ఈ జంట విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నపుడు ఆర్య ఫోటోలు తీస్తే..సాయేషా త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేస్తూ సూర్య‌కాంతి స‌మ‌క్షంలో మా ప్రేమ‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నామ‌ని తెలిపింది.
Related image
ఇక పెళ్లైన తర్వాత ఆర్య‌,సాయేషా టెడ్డీ అనే సినిమాలో న‌టించేందుకు సిద్ద‌మ‌య్యారు . శ‌క్తి సౌంద‌ర‌రాజ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం మే నుండి యూర‌ప్‌లో రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోనుంద‌ట‌.


మరింత సమాచారం తెలుసుకోండి: