టాలీవుడ్ లోకి లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది కాజల్.  ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి నెంబర్ వన్ పొజీషన్లోకి వెళ్లింది.  తెలుగు,తమిళ భాషల్లో నటించిన కాజల్ ఆ మద్య బాలీవుడ్ లోకి కూడా అడుగు పెట్టింది.  ఇప్పటి వరకు టాలీవుడ్ లో మెగాహీరోలందరితో నటించిన హీరోయిన్ కాజల్ ఒక్కతే అని చెప్పొచ్చు.   మెగాస్టార్ చిరంజీవి, పవన్, అల్లు అర్జున్, రాంచరణ్ లాంటి అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది.  ప్రస్తుతం ఆమె తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది.
Related image
తమిళంలో కమల్ సరసన 'భారతీయుడు 2' సినిమాలో నటిస్తోంది.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమెకు ఇష్టమైన నటుల గురించి చెప్పింది.  తనకు ఇష్టమైన హీరోలు అజిత్, విజయ్ అని ప్రస్తావించింది.  గతంలో విజయ్ తో తుపాకీ, జిల్లా, మెర్సల్ సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.  ఇక అజిత్ తో ‘వివేగం’సినిమాలో నటించింది. 
Related image
ఈ ఇద్దరు హీరోలతో తాను నటించే సమయంలో ఎంతో సౌమ్యంగా ఉండేవారని..స్త్రీలంటే వారికి ఎంతో గౌరవం అని..తమ సహనటీమణులతో స్నేహపూర్వకంగా ఉంటారని అన్నారు. అజిత్ గురించి మాట్లాడుతూ..వివేగం సినిమా షూటింగ్ సమయంలో ఆయన అంకితభావాన్ని చూశాను. ఆయన ఆ స్థాయికి ఎలా చేరుకున్నారనేది అర్థమైపోయింది. ఆయనలోని మానవత్వం నన్ను కదిలించి వేసింది. 

ఇక విజయ్ గురించి మాట్లాడుతూ.. సెట్స్ లోకి అడుగుపెట్టిన తరువాత ఆయన ఆ సినిమాను గురించి తప్ప మరో విషయాన్ని గురించిన ఆలోచన చేయడు. ఆయన నటనలో సహజత్వం నాకు నచ్చుతుంది. అయితే కాజల్ ఇప్పటి వరకు ఎన్నో తెలుగు సినిమాల్లో నటించినా..ఇక్కడ ఏ హీరో ప్రస్తావన తీసుకు రాకపోవడం విశేషం. 


మరింత సమాచారం తెలుసుకోండి: