సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిన ఈ రోజుల్లో చాలామంది తమ ఫోటోలు వీడియోలను ఎప్పటికప్పుడు తమ సోషల్ మీడియా ఖాతాల్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇక సెలబ్రిటీలు కూడా ఈ మాధ్యమాలను తమ సినిమాలకు మరియు వ్యక్తిగత విషయాలకు సంబంధించిన సమాచారాలను నేరుగా అభిమానులతో పంచుకునేందుకు ఊపయోగించుకుంటున్నారు. ఇకపోతే మిగతా స్టార్స్ మాదిరిగానే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఎప్పటికప్పుడు తమ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు మరియు తన మూవీ అప్డేట్స్ ను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అలానే ఆయన సతీమణి నమ్రత కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గానే ఉంటారు. 


ఇక అసలు మేటర్ ఏంటంటే మహేష్ కూతురు సితార, తండ్రివలే మంచి చలాకీ గల అమ్మాయి అనేది తెలిసిందే. ఇక మూడు రోజుల క్రితం బాహుబలి సినిమాలోని కన్నా నిదురించరా పాటకు సితార వేసిన డాన్స్ అందర్నీ ఎంతో ఆకట్టుకుంది. ఇక నేడు, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్,  మహేష్ కూతురు సితార మరియు దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆధ్యతో కలసి చేసిన ఒక వీడియో ఒకటి మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియోలో దేవిశ్రీ, శ్రీమంతుడులోని చారుశీల పాటను పాడుతుంటే, దానికి సితార, ఆద్యతో కలసి డాన్స్ ఇరగతీసిందనే చెప్పాలి. అంతేకాదు ఈ వీడియోతో పాటు దేవి శ్రీ ప్రసాద్ మహర్షి సినిమాలోని మొదటి పాటను ఈనెల 29న యూట్యూబ్లో విడుదల చేయబోతున్నాం అన్న శుభవార్త ను సూపర్ స్టార్ అభిమానులకు అందించాడు. 


ఇక ఈ వీడియో చూసిన మహేష్ ఫ్యాన్స్, దానిని విపరీతంగా షేర్లు మరియు లైకులతో తమ వారితో పంచుకుంటూ ఎంతో ఆనందపడుతున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహర్షి సినిమాలోని పాటలు విడుదల పై అప్డేట్ ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ దేవిశ్రీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నారు. మరి రాబోయే రోజుల్లో మన ముందుకు రాబోతున్న ఈ సినిమా లోని పాటలు శ్రోతలను ఏవిధంగా ఆకట్టుకుంటాయి తెలియాలంటే మరి కొద్ది రోజుల ఆగాల్సిందే......



మరింత సమాచారం తెలుసుకోండి: