తెలుగు ఇండస్ట్రీలో క్రిష్, బాలకృష్ణ కాంబినేషన్ లో ‘ఎన్టీఆర్ బయోపిక్’వచ్చింది.  ఈ చిత్రాన్ని రెండు భాగాలు ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు గా రిలీజ్ చేశారు.  ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ పై మరో రెండు చిత్రాలు వస్తున్న విషయం తెలిసిందే.  సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, కేతిరెడ్డి దర్శకత్వంలో ‘లక్ష్మీస్ వీరగ్రంధం’చిత్రాలు వస్తున్నాయి.  అయితే  ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’చిత్రాన్ని వర్మ నిర్మిస్తున్నారు. 
Related image
తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఇంటర్వ్యూలో రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ..'నాన్నగారి బయోపిక్ తీయాలనుకుంటున్నా' అంటూ గతంలో బాలకృష్ణ తనను కలిశారని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెప్పారు. సినిమాలో కాన్ ఫ్లిక్ట్ ఉంటేనే తాను సినిమా తీయగలనని బాలయ్యకు చెప్పానని తెలిపారు.  ఎన్టీఆర్ కి సంబంధించిన వారిని ఆయనే స్వయంగా నాకు పరిచయం చేశారని..వారు ఇచ్చిన సమాచారం సేకరించి ఈ చిత్రాన్ని మొదలు పెట్టానని వర్మ అన్నారు. అందుకే ఈ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణకు అంకితం చేస్తున్నానని తెలిపారు.
Image result for laxmi ntr
అయితే గత కొంత కాలంగా తాను ఓ పార్టీకి చెందిన వాడని పుకార్లు వస్తున్నాయని..తాను ఏ పార్టీకి మద్దతు పలకనని అన్నారు. ఏ పార్టీ గెలిచినా తనకు ఒరిగేది ఏమీ లేదని అన్నారు. పాతికేళ్ల క్రితం జరిగిన కథ ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ఉండొచ్చేమో కానీ, వైసీపీకి అనుకూలంగా ఎలా ఉంటుందని ప్రశ్నించారు. తాను ఫిల్మ్ మేకర్ నని, బిజినెస్ మెన్ కాదని చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: