తెలుగు ఇండస్ట్రీలో బాహుబలి తర్వాత ఆ తరహా ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’నిర్మితమవుతుంది. ఈ చిత్రానికి దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకు పోతున్న టాప్ హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రాంచరణ్ కి జంటగా బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ డైసీ ఎడ్గర్ జోన్స్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో తమిళ, కన్నడ,బాలీవుడ్, హాలీవుడ్ కి సంబంధించిన నటీనటులను తీసుకోవడంతో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రంగా ఉండబోతుంది.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా కోసం భారీ తారాగణాన్ని ఎంచుకుంటున్నట్టు ఇటీవల రాజమౌళి ప్రెస్మీట్లో తెలిపారు. ఈ చిత్రంలో ఇంట్రవెల్ ముందు ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగాన్ నటించబోతున్నట్లు తెలిసిందే. దీంతో పాటు మరో ఇద్దరు బాలీవుడ్ స్టార్స్ని ఎంచుకున్నారు.
బాలీవుడ్ ప్రముఖ నటులు సంజయ్ దత్, వరుణ్ ధావన్లు ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సినిమా దర్శక, నిర్మాతలు సంజయ్, వరుణ్ను సంప్రదించగా వారు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. కాకపోతే అధికారిక ప్రకటనే రావాల్సి ఉంది. మొత్తానికి ఈ చిత్రం విడుదలకు ముందే భారీ ఎత్తున సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉన్నట్టుంది.