ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రత్యేకమైన, పేరు ప్రతిష్టతలున్న మేడం టుస్సాడ్స్ మ్యూజియం స్టార్స్ మైనపు బొమ్మలను ప్రదర్శనలో ఉంచుతున్న విషయం తెల్సిందే. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా స్టార్స్ చాలామంది మైనపు బొమ్మలు మేడం టుస్సాడ్స్ లో ప్రదర్శనలో ఉంచబడ్డాయి. లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ మైనపు బొమ్మ కూడా మేడం టుస్సాడ్స్ సింగపూర్ ఐఫా జోన్ లో ప్రదర్శన ఉంచబడుతుంది. 


మహేష్ మైనపు బొమ్మని ప్రస్తుతం హైదరాబాద్ లో ఏ.ఎం.బి సినిమాలో ప్రదర్శనకు పెట్టారు. కొద్దిసేపటి క్రితమే మహేష్ మైనపు బొమ్మను రివీల్ చేశారు. అచ్చు గుద్దినట్టు మహేష్ బాబులా అనిపిస్తున్న మహేష్ మైనపు బొమ్మ చూసి మహేష్ షాక్ అయ్యాడని చెప్పొచ్చు. సింగపూర్ లో కాకుండా వారి మైనపు బొమ్మలను వేరే చోట ప్రదర్శనలో పెట్టడం ఇదే మొదటిసారని వారు అన్నారు. 


ప్రతి ఒక్క ఆర్టిస్టుకి ఇదొక లైఫ్ అచీవ్ మెంట్ లా భావిస్తారు. అమితాబ్, షారుఖ్ , కాజోల్ ,ఐశ్వర్యా రాయ్, అనుష్క శర్మ, ప్రభాస్ వంటి స్టార్స్ ఇప్పటికే మేడం టుస్సాడ్స్ లో స్థానం దక్కించుకున్నారు. సింగపూర్ మేడం టుస్సాడ్స్ లో మహేష్ మైంపౌ బొమ్మ ప్రదర్శనలో ఉంటుంది. మహేష్ మైనపు బొమ్మ తయారు చేసేందుకు వారు 200 మెజర్ మెంట్స్ తీసుకోవడం జరిగిందట. 


కొద్దిరోజులు హైదరాబాద్ లో ప్రదర్శనలో ఉంచబడుతున్న మహేష్ మైనపు బొమ్మ త్వరలోనే సింగపూర్ మ్యూజియంకు తరలించబడుతుందట. మహేష్ అతని పక్కన ఆ స్టాట్యూ చూస్తే అందులో రియల్ మహేష్ ఎవరో కనిపెట్టలేరు అన్నట్టుగా మేడం టుస్సాడ్స్ వారు మహేష్ బొమ్మని సిద్ధం చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: