సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25వ సినిమా మహర్షి లో నటిస్తున్న విషయం తెలిసిందే. అనంతరం ఆయన ఇటీవల ఎఫ్2 సినిమాతో సూపర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరొక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇక తన తదుపరి సినిమాలపై కూడా ఎన్నడూ లేనంతగా ఫోకస్ పెట్టి ముందుకు సాగుతున్న సూపర్ స్టార్, నేడు హైదరాబాదులోని తన సొంత మల్టీప్లెక్స్ అయిన ఏఎంబి సినిమాస్ లో, సింగపూర్ కు చెందిన మేడం టుస్సాడ్స్ మ్యూజియం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన తన మైనపు విగ్రహాన్ని అతిథులు మరియు అభిమానుల సమక్షంలో ఆవిష్కరించారు. 


ఈ కార్యక్రమానికి హాజరైన సింగపూర్ కు చెందిన షార్ట్స్ మ్యూజియం ప్రతినిధులు, మహేష్ ఫాలోయింగ్ మరియు ఆయన చరిష్మా పై పొగడ్తల జల్లు కురిపించారు. ఇక విగ్రహావిష్కరణ అనంతరం మహేష్ మాట్లాడుతూ, మొదట ఈ మైనపు విగ్రహాన్ని చూసిన తన స్నేహితులు అద్భుతంగా ఉందని కితాబిచ్చారు అని అన్నారు. ఇక తన భార్య నమ్రత మరియు పిల్లలు గౌతమ్, సితార కూడా చాలా బాగుందని చెప్పారని అన్నారు. ఇంతటి అత్యున్నతమైన ఘనత కలిగిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వారు, తన విగ్రహాన్ని ఏర్పాటు చేయటం సంతోషంగా ఉందని, ఆ మ్యూజియం ప్రతినిధులు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. 


ఇక తమ అభిమాన సూపర్ స్టార్ మైనపు విగ్రహాన్ని చూడడానికి వేలాదిగా మహేష్ అభిమానులు ఉదయం నుండే ఏఏంబి సినిమాస్ కు చేరుకున్నారు. ఇక ఒక్కసారిగా మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని చూసిన అభిమానుల కళ్ళల్లో విపరీతమైన ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఆ మైనపు విగ్రహాన్ని చూస్తుంటే అచ్చం మహేష్ బాబు చూస్తున్నట్టే ఉందని, జీవకళ ఉట్టిపడేలా విగ్రహాన్ని రూపొందించిన టుస్సాడ్స్ మ్యూజియం వారికి థాంక్స్ చెబుతూ సోషల్ మీడియా వేదికల్లో ఆ మైనపు విగ్రహం ఫోటోలను విపరీతంగా షేర్స్ , లైక్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ వార్త మీడియా వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతుంది,..



మరింత సమాచారం తెలుసుకోండి: