ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు జయలలిత జీవిత కథ ఆధారంగా ప్రస్తుతం తమిళనాట వరుసగా బయోపిక్ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి.   ఈ నేపథ్యంలో మాలీవుడ్ దర్శకుడు ప్రియదర్శన్ జయలలిత బయోపిక్ తీస్తున్నారు. ఇందులో మాలీవుడ్ బ్యూటీ నిత్యామీనన్ లీడ్ రోల్ పోషిస్తుంది.  ప్రస్తుతం  దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ ను తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో 'తళైవి', హిందీలో 'జయ' పేర్లతో ఈ చిత్రం తెరకెక్కనుంది. 

అయితే ఈ చిత్రం కోసం ఎంతో మంది హీరోయిన్లను లీస్టు లోకి తీసుకున్నా ఫైనల్ గా బాలీవుడ్ క్వీన్ కంగనా రౌనత్ నే ఫైనల్ చేసినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.  ఈ మద్య కంగనా నటించిన ‘మణికర్ణిక’సూపర్ హిట్ కావడంతో ఆమెకు దేశ వ్యాప్తంగా ఎంతో గొప్ప పేరు వచ్చింది.  దాంతో జయలలిత బయోపిక్ కి కంగనా నే కరెక్ట్ అనుకున్నారు. 

ఈ సినిమా కోసం నిర్మాతలకు షాక్ ఇచ్చింది కంగనా.  ‘తళైవి’ మూవీ కోసం కంగనా ఏకంగా రూ. 24 కోట్లు డిమాండ్ చేసిందట. ఆమె అడిగిన మొత్తాన్ని ఇచ్చేందుకు కూడా దర్శకనిర్మాతలు సుముఖంగా ఉన్నారట. కంగనాకు దేశ వ్యాప్తంగా మార్కెట్ ఉండటంతో... ఆ మొత్తం ఇచ్చినా, పైసా వసూల్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారని సమాచారం. సినీ రంగంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో ఈ అమ్మడు కూడా రికార్డు క్రియేట్ చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: