ఈ మాటలు అంటుంది ఎవరో కాదు మంచు విష్ణు సతీమణి వెరోనికా.  ఈ మద్య మంచు ఫ్యామిలీ వైఎస్ జగన్ మెహన్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసిన విసషయం తెలిసిందే.  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారిపోతున్నాయి.  ఈ నేపథ్యంలో ఏ నాయకులు ఎటు వైపు మళ్లుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. 

ఈ నేపథ్యంలో మంచు విష్ణు భార్య ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ కు మద్దతు ఇవ్వడంపై కొందరు నెటిజన్ల విమర్శలు ఎదుర్కొంది.  తాజాగా తనపై వస్తున్న విమర్శలకు ఘాటుగానే స్పందించింది.  జగన్ తన అన్న అనీ, తన రక్తమని వెరోనికా వ్యాఖ్యానించారు. తనకు అన్నింటి కంటే తన కుటుంబమే ముఖ్యమని స్పష్టం చేశారు.

‘నేను వైఎస్ జగన్ ను ఎందుకు సమర్థిస్తున్నానని చాలామంది అడుగుతున్నారు. నేను ఎందుకు సపోర్ట్ చేయకూడదు? మీకు తెలియదేమో! జగన్ నా అన్న.. నా రక్తం. నామటుకు అన్నింటికంటే నా కుటుంబమే ముఖ్యం.. #APneedsYSJagan #VoteForFan #APElections2019’ అంటూ తన ట్విట్టర్ లో పేర్కొంది. 
 For all those questioning why I support @YSRCParty Why wouldn’t I? If you don’t have clarity, then get some. @ysjagan is my brother, my blood. And for me, my family always comes FIRST. #APneedsYSJagan #VoteForFan #APElections2019

మరింత సమాచారం తెలుసుకోండి: