టాలీవుడ్ లో యూత్ క్రేజీ హీరోగా వరుసగా విజయాలు తన సొంతం చేసుకుంటున్నాడు విజయ్ దేవరకొండ. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి,గీతా గోవిందం, టాక్సీవాలా ఇలా వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ తో ముందుకు వెళ్తున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. గీతాగోవిందం హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ఇది రెండో మూవీ. ఇటీవల విడుదలైన టీజర్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది.
ఇక తమిళ స్టార్ హీరో సూర్యకి తెలుగులోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. సూర్య నటించిన ప్రతి మూవీ తెలుగు లో కూడా రిలీజ్ చేస్తుంటారు. తెలుగు హీరోలతో మంచి సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. సూర్య నటించిన తాజా చిత్రం ఎన్జీకే( నంద గోపాలన్ కుమారన్). సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి సంబంధించి విడుదలైన టీజర్స్, సాంగ్స్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈ సినిమా మే 31న ఎన్జీకే చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది.
ఇదే రోజు తమిళ నాట విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ చిత్రం కూడా రిలీజ్ అవుతుంది. గతంలో నోటా సినిమాతో తమిళంలో అడుగు పెట్టిన విజయ్ దేవరకొండ ఇప్పుడు డియర్ కామ్రేడ్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఎన్జీకే మూవీలో లో సూర్య సరసన సాయిపల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటించారు . యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు.