అను నిత్యం తన మేనమామల నామస్మరణ చేసే సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహానికి గురికావడం సంచలన వార్తగా మారింది. మొన్న సాయిత్రం రిలీజ్ అయిన తేజ్ మూవీ చిత్రలహరిలోని పాట గ్లాస్ మేట్స్ ‘జనసేన’ కు మేలు చేస్తుంది అనుకుంటే ఆపాట ‘జనసేన’ పై నెగిటివ్ ఫీలింగ్ కలిగేలా మారిందని పవన్ వీరాభిమానులు అభిప్రాయపడుతున్నారు. 
మైత్రి మూవీస్
మందు పార్టీలలో ఉపయోగించే గ్లాస్ లను చూపెడుతూ ఈ పాటలో సాయి ధరమ్ తేజ్ చేసిన హడావిడి పవన్ టి గ్లాసుకు ఎలా సహాయపడుతుంది అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. దీనికితోడు పవన్ పేదవారికి ఎంతో ప్రీతి పాత్రమైన టీ గ్లాస్ ను తన ఎన్నికల గుర్తుగా ప్రచారం చేస్తుంటే తేజ్ మందు గ్లాస్ ను చూపెడుతూ పవన్ కు ఎలా సహాయపడుతాడు అంటూ అభిమానులు మాత్రమే కాకుండా జనసైనికులు కూడ అభిప్రాయ పడుతున్నారు. 

సినిమాలలో మందు గ్లాసులతో పాటలు పబ్ లలో చిందులు సర్వసాధారణం అయినప్పటికీ ఈ పాట పవన్ అభిమానులకు కిక్ ఇస్తుంది అని తేజ్ అభిప్రాయపడుతూ ఈ విధమైన సంకేతాలు ఈపాట విడుదలకు ముందు తేజ్ పవన్ అభిమానులకు ఎందుకు ఇచ్చాడు అంటూ ఏకంగా పవర్ స్టార్ అభిమానులు తేజ్ ను ప్రశ్నిస్తున్నారు. దీనితో తేజ్ తన మేనమామకు ఎదో ఊహించుకుని సహాయం చేద్దామని చేసిన ప్రయత్నం ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది. 
 ఇద్దరు హీరోయిన్లతో
దీనికితోడు ఈపాటకు దేవిశ్రీ ప్రసాద్ అందించిన ట్యూన్ కూడ పెద్దగా యూత్ కు కనెక్ట్ అవ్వకపోవడంతో ఈ గ్లాస్ మేట్స్ ప్రయోగం అన్ని విధాల ఫెయిల్ అయింది. ఇప్పటికే వరస పరాజయాలతో సతమతమవుతున్న సాయి ధరమ్ తేజ్ ‘చిత్రలహరి’ పాటలకు పెద్దగా స్పందన రాకపోవడం అతడికి మరింత షాక్ ఇచ్చే న్యూస్..   


మరింత సమాచారం తెలుసుకోండి: