భారత దేశంలో ఈ మద్య మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువ అయ్యాయి.  ఈ బాధలు సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు కొనసాగుతుంది.  గతంలో తమపై లైంగిక వేధింపులు చేశారని బాలీవుడ్ లో తనూశ్రీ దత్తా నటుడు నానా పటేకర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.  ప్రముఖ సింగర్ చిన్మయి తనపై రచయిత వైర ముత్తు లైంగిక వేధింపులకు పాల్పపడ్డాడని ఆరోపించింది.  సినిమాల్లో ఆడవారిని గౌరవించాలి..వారిపై అఘాయిత్యాలకు పాల్పపడిన వారికి శిక్ష తప్పదని తెగ చూపిస్తుంటారు.
Image result for nayanthara
కానీ నిజ జీవితంలో మాత్రం కొంత మంది నటులు తామేమి మాట్లాడుతున్నామో తెలియని పరిస్థితుల్లో ఎదుటివారిపై నోరు పడేసుకుంటున్నారు.  దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతారని ఉద్దేశిస్తూ సీనియర్ నటుడు రాధారవి చేసిన అసభ్యకర వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.  ఈ విషయంపై కోలీవుడ్ మొత్తం రాధా రవిపై తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నారు.  అయితే తనపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై నయన తార తీవ్రస్థాయి మండిపడింది.  తాజాగా ఇప్పుడు సమంత సైతం గట్టి కౌంటర్ ఇచ్చింది.

''మిస్టర్ రాధారవి.. కష్టమనేది ఎప్పటికీ అలాగే నిలిచిపోతుంది. మీరు చాలా బాధపడుతున్న వ్యక్తి. అందుకు మిమ్మల్ని చూస్తుంటే బాధేస్తుంది. మీకు ప్రశాంతత లభించాలని కోరుకుంటున్నాం. నయనతార తర్వాతి సూపర్ హిట్ సినిమా టికెట్లు మీకు కొనిస్తాం. పాప్ కార్న్ తింటూ ఆశ్వాదించండి'' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. సమంత పెట్టిన ట్విట్ కి నెటిజన్లు సైతం సపోర్ట్ ఇస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: