ఆ మద్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘ఫిదా’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది సాయి పల్లవి.  గతంలో బుల్లితెరపై డ్యాన్స్ షో ద్వారా తెలుగు ప్రజలకు పరిచయం అయినప్పటికీ ‘ఫిదా’చిత్రంతో సాయి పల్లవి మంచి మార్కులు కొట్టేసింది.  తెలంగాణ యాసలో మాట్లాడుతూ తెలుగు ప్రజల మనసు దోచింది.  


ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో వరుస ఛాన్సులు కొట్టేస్తూ స్టార్ హీరోల సరసన నటిస్తుంది సాయిపల్లవి.  అయితే ఈ అమ్మడి రేంజ్ పెరుగుతున్నా కొద్ది రూమర్లు కూడా ఎక్కువే అవుతున్నాయి.  ఆ మద్య ఓ హీరో ప్రేమలో ఉన్నదని తెగ పుకార్లు వచ్చాయి. తాజాగా మరో దారుణమైన పుకార్లు సాయి పల్లవిపై వచ్చాయి.  కోలీవుడ్ డైరెక్టర్ AL విజయ్ ను పెళ్లి చేసుకోవడానికి సాయి పల్లవి సిద్దమవుతున్నట్లు రూమర్స్ వచ్చాయి.  దాంతో సాయి పల్లవి ఫ్యాన్స్ ఈ కథనాలపై సీరియస్ గా కామెంట్ చేస్ట్సున్నారు. ఈ విషయంపై సాయి పల్లవి సోషల్ మీడియాలో తనపై వస్తున్న పుకార్లపై ఫైర్ అయ్యారు. 


  దేనికైనా ఓ హద్దూ పద్దూ ఉండాలి..అని అంటున్నారు.  సాయి పల్లవితో డైరెక్టర్ విజయ్ గత ఏడాది కణం అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే.అయితే సాయి పల్లవి అభిమానులు ఆగ్రహం వెనుక బలమైన కారణం కూడా ఉంది డైరెక్టర్ విజయ్ ఇదివరకు అమలాపాల్ తో డేటింగ్ చేసి వివాహం చేసుకొని కొన్నాళ్ళకె విడిపోయాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: