ఆర్జివి తీసిన లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా ఎట్టకేలకు మార్చి 29న రిలీజ్ కాబోతుంది. సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని అనుకున్న విధంగా ఈ శుక్రవారం లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సినిమా ఆపాలన్న టిడిపి ప్రయత్నాలు ఫలించలేదు. ఇక సినిమా ప్రమోషన్స్ లో వర్మ చాలా బిజీగా ఉన్నాడు. ఈ చిట్ చాట్ లో ప్రస్తుతం ఉన్న స్టార్స్ గురించి వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.


ముందుగా యాంకర్ చిరంజీవి అనగానే మెగా అని ఆన్సర్ చెప్పిన రాం గోపాల్ వర్మ.. బాలకృష్ణ పేరు వింటే తనకు లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ గుర్తుకు వస్తుందని అన్నారు. నాగార్జున అనగానే తాను ఇప్పుడు ఇక్కడ ఉండడానికి కారణం నాగార్జున అని అన్నారు. ఇక వెంకటేష్ కు క్షణ క్షణం అని అన్నారు. పవన్ కళ్యాణ్ హైలీ ఎంటర్టైనర్.. అతన్ని సిఎంగా చూడాలని అనుకుంటున్నా.. రోజు అంతమంచి అందగాడు ఫ్రెంట్ పేజ్ లో కనిపించడం బాగుంటుందని అన్నారు.     


ఇక మహేష్ బాబు అనగానే వెరీ హ్యాండ్సం గాయ్.. ట్రూ సూపర్ స్టార్ అన్నారు ఆర్జివి. ఇక జూనియర్ ఎన్.టి.ఆర్ అనగానే ఐలవ్ హిస్ ఎనర్జీ.. సీనియర్ ఎన్.టి.ఆర్ కు సరితూగే వ్యక్తి అనేలా మాట్లాడాడు. ఇక లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ లో జూనియర్ ఎన్.టి.ఆర్ ను పెట్టాలని అనుకోలేదా అంటే అలా ఎప్పుడు అనుకోలేదని తన సినిమాల్లో స్టార్ ఇమేజ్ పనికిరాదని.. అందుకే సాధ్యమైనంత వరకు కొత్త వాళ్లతో తీస్తా అన్నారు ఆర్జివి.   


రిలీజ్ ముందు ఎన్నో సంచలనాలు సృష్టించిన లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ రిలీజ్ తర్వాత ఎలాంటి హంగామా చేస్తుందో చూడాలి. ఈ సినిమాను బాలకృష్ణకు అంకితం అని చెబుతున్న ఆర్జివి నిజంగా సినిమా టీజర్, ట్రైలర్ లో చూపించినట్టుగా సినిమా చేశాడా లేదా అన్నది తెలియాలంటే మరో 3 రోజులు వెయిట్ చేసే సరిపోతుంది.    



మరింత సమాచారం తెలుసుకోండి: