సూపర్ స్టార్ మహేష్ వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న సినిమా మహర్షి. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని మొదటి సాంగ్ కొద్ది నిమిషాల క్రితం రిలీజైంది. చోటి చోటి అంటూ సాంగే ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించారు.


మహేష్, నరేష్ స్నేహితులుగా నటిస్తున్న ఈ సినిమా మనసుని కదిలించేలా ఉంటుందని తెలుస్తుంది. మొదటి సాంగ్ దేవి మార్క్ మ్యూజిక్ తో అద్భుతమైన లిరిక్స్ తో వచ్చింది. ఈ పాటలో మహేష్, నరేష్, పూజా హెగ్దెల ఫ్రెండ్ షిప్ చూపించారు. కొన్నాళ్లుగా మహేష్ ఒకే రకమైన లుక్ లో కనిపిస్తున్నాడని అప్పట్లో విమర్శలు వచ్చాయి.


అందుకే మహర్షిలో మహేష్ కొత్త లుక్ ట్రై చేశాడు. స్టూడెంట్ గా.. ఓ పెద్ద కంపెనీ సీ.ఈ.ఓగా ఇలా మహేష్ పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని తెలుస్తుంది. వంశీ పైడిపల్లి చెప్పిన కథకు ఇంప్రెస్ అవడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. మే 9న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు.


మహేష్ 25వ సినిమాగా వస్తున్న మహర్షి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. మొదటి పాట విన్న తర్వాత దేవి మహేష్ కు మరో హిట్ మ్యూజిక్ ఇచ్చాడని చెప్పొచ్చు. మహేష్ నెగటివ్ సెంటిమెంట్ అయిన మేలో వస్తున్న మహర్షి మహేష్ కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: