తెలుగు ఇండస్ట్రీలో బాహుబలి, బాహుబలి 2 లాంటి ప్రతిష్టాత్మక చిత్రాలు తెరకెక్కించిన దర్శకధీరుడు రాజమౌళి సంవత్సరం గ్యాప్ తీసుకొని భారీ స్థాయిలో మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.  రాంచరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఈ చిత్రం రాబోతుంది.  ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు.  ఈ చిత్రం 1920 కాలం నాటి ఇద్దరు మన్యం వీరులకు సంబంధించినదని...ఆంధ్రలో అల్లూరి సీతారామరాజు, తెలంగాణలో కొమురం భీమ్ కి సంబంధించిన కథానేపథ్యంలో కొనసాగుతుందని రాజమౌళి చెప్పారు. 

ఇక అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్ నటిస్తే..కొమురంభీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్నారు.  ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగాన్ కూడా నటిస్తున్నాడు.  హీరోయిన్లుగా ఆలియాభట్, డైసీ ఎడ్గార్ జోన్స్  లు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.  ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గుజరాత్ లో భారీ షెడ్యూల్ ను తెరకెక్కించబోతున్నారు. ఈ నేపథ్యంలో తారక్, రాం చరణ్, రాజమౌళి తదితరులు ఈ ఉదయం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి గుజరాత్ లోని వడోదరకు బయల్దేరారు.

తాజాగా ఈ విషయాన్ని ఎన్టీఆర్ ట్విట్టర్ లో తన అభిమానులతో పంచుకున్నాడు. 'ఆర్ఆర్ఆర్' భారీ షెడ్యూల్ కోసం బయల్దేరుతున్నానని ట్వీట్ చేశాడు. దీనికి తోడు ముగ్గురి టికెట్లను షేర్ చేశాడు.  ఇక ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధి లేటెస్ట్ అప్ డేట్స్ కూడా తమ అభిమానులతో పంచుకుంటామని చెబుతున్నారు ఇద్దరు హీరోలు. 


మరింత సమాచారం తెలుసుకోండి: