రాం గోపాల్ వర్మ డైరక్షన్ లో వచ్చిన లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా ఆంధ్రప్రదేశ్ లో తప్ప అన్ని చోట్ల రిలీజ్ చేశారు. లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ఏపిలో రిలీజ్ కానివ్వకుండా అడ్డు పడ్డది ఎవరో తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని అన్నాడు ఆర్జివి. ఏపి హై కోర్ట్ సినిమా రిలీజ్ ను ఆపేయగా తాను సుప్రీం కోర్ట్ కు వెళ్తున్నానని అన్నారు.  


ఈ సినిమా రిలీజ్ అయితే కష్టమని భావించిన వారే కావాలని రిలీజ్ ఆపించేశారని.. అప్పట్లో ఎన్.టి.ఆర్ సింహ గర్జన జరుగకుండా చేసిన వారే లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ రిలీజ్ అవకుండా అడ్డు పడ్డారని.. అప్పుడు కాదు ఈ సినిమా రిలీజ్ ఆపేసి మరోసారి వెన్నుపోటు పొడిచారని అన్నారు ఆర్జివి. తను మాట్లాడిన మాటల్లో ఒక్కసారి కూడా చంద్రబాబు పేరు ప్రస్థావించలేదు ఆర్జివి.  


ఈరోజు రిలీజైన లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా అన్నిచోట్ల సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఎన్.టి.ఆర్ అసలు కథను చెప్పే దమ్ము ధైర్యం ఉన్న ఒకేఒక్క దర్శకుడు ఆర్జివి మాత్రమే అని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. ఆర్జివి కూడా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమాను అంతే కసిగా తెరకెక్కించాడు.


ఎప్పుడూ తన సినిమాల విషయంలో ఒకటి చెప్పి మరోటి చేసే ఆర్జివి లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ విషయంలో మొదటి నుండి చెప్పుకుంటూ వచ్చిన విషయాన్ని సినిమాలో చూపించాడు. లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమాలో కాస్ట్ అండ్ క్రూ కూడా బాగా కుదిరిందని తెలుస్తుంది. సినిమాకు హిట్ టాక్ రావడం.. అన్నిచోట్ల హౌజ్ ఫుల్స్ నడవడం ఇంతమంది ఎన్.టి.ఆర్ అసలు కథని తెలుసుకోవాలని చూస్తున్నారని అన్నారు వర్మ.



మరింత సమాచారం తెలుసుకోండి: