ప్రస్తుతం టాలీవుడ్ లో మెగాబ్రదర్ నాగబాబు తనయ కొణిదెల నిహారిక హీరోయిన్ తన హవా కొనసాగిస్తుంది.  మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలు వచ్చినా..మొదటి సారిగా ఆ కుటుంబం నుంచి హీరోయిన్ నిహారిక అనే చెప్పాలి.  మొదట టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టిన నిహారిక ఢీ రియాల్టీ షోలో తనదైనా మార్క్ చాటుకుంది.  తెలుగు ప్రేక్షకుల అభిమాన సంపాదించిన ఆమె కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించింది.  ఆ తర్వాత నాగశౌర్ హీరోగా ‘ఒక మనసు’సినిమాలో హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అయ్యింది. 

అయితే ఈ సినిమాలో నిహారిక నటనకు బాగానే ఉన్నా..కమర్షియల్ గా మాత్రం హిట్ కాలేక పోయింది.  ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా పెద్దగా హిట్ టాక్ తెచ్చుకోలే పోయాయి. గ్యాప్ ను పట్టించుకోకుండా మంచికథ కోసం .. మంచి పాత్ర కోసం వెయిట్ చేస్తూ అవకాశాలను సొంతం చేసుకుంటోంది.  తాజాగా ఆమె చేసిన 'సూర్యకాంతం' చిత్రం ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా నిహారిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..చిత్ర పరిశ్రమలో కొన్ని సార్లు మనం ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి.  మంచి హిట్ సినిమాలు మనదాకా వచ్చినా అనుకోకుడా చేజారిపోతుంటాయి.  అలా వెళ్లిన సినిమాలు హిట్ అయినప్పుడు 'అయ్యో ఆ సినిమా చేసి వుంటే బాగుండేదే' అనిపిస్తూ ఉంటుంది. 

టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన మూవీ  'నేను శైలజ' .  ఈ మూవీలో హీరోయిన్ గా మొదట నన్నే సంప్రదించారు..కానీ ఆ సమయంలో నేను హీరోయిన్ గా కావాలని మా కుటుంబ సభ్యుల్ని ఒప్పించే ప్రయత్నంలోనే ఉన్నానని చెప్పింది.  నా కోసం ఆ సినిమా వాళ్లు నెల రోజుల పాటు వెయిట్ చేశారు. నా నుంచి ఎలాంటి ఆన్సర్ రాకపోవడంతో, మాలీవుడ్ నటి కీర్తి సురేశ్ ను తీసుకున్నారు.  ఏది ఏమైనా నా కెరీర్ లో మంచి హిట్ సినిమా మిస్ అయ్యాను అని చెప్పుకొచ్చింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: