నా పేరు సూర్య తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రం తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుంది. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత త్రివిక్రం, బన్ని కలిసి చేస్తున్న హ్యాట్రిక్ మూవీగా ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు ఏర్పడ్డాయి. ఫాదర్ సెంటిమెంట్ తో వస్తున్న ఈ సినిమాలో టాలెంటెడ్ ఆర్టిస్ట్ నానా పటేకర్ ను తీసుకోవాలని చూస్తున్నారట.


బన్ని తండ్రి పాత్రకు ఆయన్ను సెలెక్ట్ చేయాలని చూస్తున్నారట. అయితే ఇటీవల మీటూ మూమెంట్ లో నానా పటేకర్ మీద సంచలన కామెంట్స్ చేసింది తనుశ్రీ దత్తా. ఆ దెబ్బతో అతని చేతిలో ఉన్న ఆఫర్స్ అన్ని ఖాళీ అయాయి. హౌజ్ ఫుల్ సీరీస్ నుండి కూడా అతన్ని కాదని రానాని అందులో తీసుకున్నారు.


ఇప్పుడు తెలుగులో నానా పటేకర్ సినిమా చేస్తే ఒకవేళ సినిమా మీద ఏదైనా గొడవ చేస్తారా అన్న టెన్షన్ పట్టుకుంది. త్రివిక్రం అయితే నానా పటేకర్ అయితేనే బాగుంటుందని అంటున్నాడట. బన్ని రిస్క్ ఎందుకని చెబుతున్నాడట ఆయన అనుకున్న పాత్రలో మరెవరిని తీసుకుంటారో తెలియాల్సి ఉంది.


ఇక ఈ సినిమాతో పాటుగా బన్ని సుకుమార్ కాంబినేషన్ లో మూవీ కూడా త్వరలో మొదలు కానుంది. అయితే ఆ సినిమా ఆర్య సీరీస్ అవుతుందా లేక కొత్త కథతో వస్తారా అన్నది తెలియాల్సి ఉంది. సూపర్ స్టార్ మహేష్ కు చెప్పిన కథనే బన్నితో తీస్తున్నాడన్న టాక్ కూడా ఉంది. మొత్తానికి బన్ని తన సినిమాల స్పీడ్ పెంచాడని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: