ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఈ క్రమంలో చాలామంది ఆయా పార్టీల తరఫున స్టార్ క్యాంపెయినర్లు గా ప్రజల మధ్యకు వస్తూ మద్దతు తెలుపుతుండగా ...టాలీవుడ్ ఇండస్ట్రీలో  సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమాన సంఘం అధ్యక్షుడు సురేష్ తాజాగా వైఎస్ఆర్సీపీలో 500 మంది మహేష్ అభిమానులతో కలసి చేరారు.


నెల్లూరులోని నర్తకి సెంటర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నెల్లూరు పార్లమెంట్‌ అభ్యర్థి ఆదాల ప్రబాకర్‌రెడ్డి, నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా అబిమాన సంఘం బైక్‌ ర్యాలీ నిర్వహించగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి జెండా ఊపి ప్రారంబించారు. ఆదాల మాట్లాడుతూ కొన్ని రోజులుగా వందలాది మంది వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారన్నారు.


పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం ఉంటుందన్నారు. ముఖ్యంగా వైయస్ కుటుంబానికి మరియు ప్రశ్న గారి కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయని ఇదే క్రమంలో చాలా సార్లు మహేష్ బాబు కూడా పలు ఇంటర్వ్యూలలో వైయస్ రాజశేఖర్ రెడ్డి గురించి అలాగే వైసిపి పార్టీ జగన్ గురించి తన మనసులో ఉన్న అభిమానం కూడా బయట పెట్టిన దాఖలాలు ఉన్న నేపథ్యంలో తాజాగా మహేష్ అభిమానులు వైసీపీ పార్టీలో చేరడంతో ఈ విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ మరియు తెలుగు రాజకీయాలలోనూ పెద్ద హాట్ టాపిక్ అయింది.




మరింత సమాచారం తెలుసుకోండి: