పెళ్లి తర్వాత అక్కినేని నాగచైతన్య మరియు సంబంధాలు కలిసి నటించిన మజిలీ సినిమా వేసవి కానుకగా విడుదల అవటానికి సిద్ధంగా ఉంది. మజిలీ సినిమాపై ఇప్పటికే అక్కినేని అభిమానులు భీభత్సమైన అంచనాలు పెట్టుకున్నారు. ఇదే క్రమంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టాలని ఇప్పటికే డిసైడ్ అయిన చిత్ర యూనిట్ దానికి సంబంధించిన ఏర్పాట్లు కార్యక్రమాలలో తలమునకలవుతున్నారు.
ఈనెల అనగా 31 వ తారీకు ఆదివారం ప్రీ రిలీజ్ వేడుకలో హైదరాబాద్ ఫిలిం నగర్ లో ఉన్న జేఏసీ కన్వెన్షన్ సెంటర్ లో స్టార్ హీరోలు అయిన నాగార్జున మరియు విక్టరీ వెంకటేష్ ల సమక్షంలో ఈ వేడుకలు చాలా ఘనంగా జరపడానికి మజిలీ యూనిట్ ఏర్పాట్లకు పూనుకొంది. ఈ మధ్య కాలంలో వెంకీ, నాగ్ని ఒకే స్టేజ్పై చూసిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి.
ఇప్పుడు ఈ అరుదైన ఘట్టానికి మజిలీ ప్రీ రిలీజ్ వేడుక వేదిక కానుంది. అంతేకాకుండా ఇదే వేడుకలో వీరిద్దరూ కలిసి చిత్ర థియేట్రికల్ ట్రైలర్ను ఆవిష్కరించనున్నారు. ఈ చిత్రంలో దివ్యాన్ష కౌశిక్ రెండో హీరోయిన్గా నటించింది. ముఖ్యంగా పెళ్లి తర్వాత నాగచైతన్య, సమంత కలిసి నటించిన సినిమా అయిన నేపథ్యంలో ఈ సినిమా గురించి అక్కినేని అభిమానులతో సినిమా ప్రేమికులు కూడా ఎంతగానో ఆశగా ఎదురుచూస్తున్నారు.