యూత్ కు ఐ కాన్ గా మారిపోయిన విజయ్ దేవరకొండ క్రేజ్ తో ఇతడికి సంబంధించిన ఏ వార్తలు వచ్చినా ఆవార్తలు వెంటనే వైరల్ గా మారిపోతున్నాయి. ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటించిన  ‘అర్జున్ రెడ్డి’ చిత్రం పలు భాషల్లోకి రీమేక్ అవుతున్నవిషయం తెలిసిందే. ఇది ఇలా ఉండగా ఈ మూవీ హిందీ రీమేక్‌లో ప్రీతి పాత్రను పోషిస్తున్న కియారా అద్వానీ ఇటీవల విజయ్ దేవరకొండను కలుసుకోవడం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. 

హిందూస్థాన్ టైమ్స్ ఇండియాస్ మోస్ట్ స్టైలిష్ 2019 అవార్డుల వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.  ఈ ఫంక్షన్ కు ప్రముఖ  బాలీవుడ్ దక్షిణాది సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండకు కూడా ఆహ్వానం పంపడంతో ఆ కార్యక్రమానికి అతడు కూడ వెళ్ళడం జరిగింది. 

ఈ కార్యక్రమానికి  బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కూడ వచ్చింది. పింక్ కలర్ డ్రెస్ తో వచ్చిన ఈమె ఈ ఫంక్షన్ కు హాట్ టాపిక్ గా మారడంతో మీడియా కెమెరాలు అన్ని ఈమె చుట్టూ తిరిగాయి. అయితే ఈ ఫంక్షన్ కు వచ్చిన కియారా విజయ్ లు ఒకరినొకరు ప్రేమగా పలకరించు కోవడమే కాకుండా వీరిద్దరూ అత్యంత సన్నిహితంగా మాట్లాడు కోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. 

అంతే కాదు ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా కెమెరాలకు నవ్వుతూ వీరిద్దరూ కలసి పోజులు ఇచ్చారు. ఈ ఫోటోలలో కొన్నింటిని విజయ్ తన ఇన్స్‌ టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేయడంతో వీరిద్దరి స్నేహం పై ఇప్పుడు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. దీనితో వీరిద్దరూ కలసి ఒక సినిమాలో నటించడం ఖాయం అనే కామెంట్స్ వస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: