సినిమా షూటింగ్ సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకొని కొన్ని సార్లు ప్రమాదాలు సంబవిస్తుంటాయి. గతంలో పలుమార్లు షూటింగ్ సమయాల్లో అగ్ని ప్రమాదాలు..సెట్టింగ్స్ కుప్పకూలి పోవడాలు జరిగిన విషయం తెలిసిందే. ఇలాంటి ప్రమాదాల్లో ప్రాణాలు కూడా పోయాయి. తాజాగా నటుడు చిరంజీవి సర్జా నటిస్తున్న ‘రణం’మూవీ షూటింగ్ లో అపశృతి చోటు చేసుకుంది. గ్యాస్ సిలండర్ పేలడంతో తల్లీ కూతురు మరణించారు. చిరంజీవి సర్జా నటిస్తోన్న ‘రణం’షూటింగ్ బెంగుళూరు నగరంలోని బాగాలూరు వద్ద జరుగుతుంది.
సుయేరా భాను తన ఐదేళ్ల చిన్నారితో కలిసి షూటింగ్ చూడడానికి వెళ్లింది. అయితే షూటింగ్ లో ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. కారును బ్లాస్ట్ చేసే సన్నివేశం షూట్ చేస్తుండగా..అకస్మాత్తుగా సిలిండర్ పేలింది. దాంతో అక్కడే ఉన్న తల్లీ సుయేరా భాను కూతురు అయిషా ఖాన్(5) అక్కడిక్కడే మరణించారు..మరో చిన్నారికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.
అయితే పేలుడు సంబవించడంతో షూటింగ్ క్యాన్సల్ చేసి అక్కడ నుంచి చిత్ర బృందం ఎస్కేప్ అయ్యారు. ప్రధాన పాత్ర పోషిస్తున్న చేతన్ కుమార్ విషయం తెలుసుకొని తన ఆవేదన వ్యక్తం చేశాడు. షూటింగ్ లో మరణించిన, గాయపడ్డ వారికి తప్పకుండా సహాయం అందిస్తామని అన్నారు. కాగా, ఈ సినిమాలో హీరోగా నటిస్తోన్న చిరంజీవి మరో సినిమా షూటింగ్ కోసం మైసూరుకి వెళ్లారు.