కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన భారీ బడ్జెట్‌ బడ్జెట్ మూవీ ‘కేజీఎఫ్’. దాదాపు ఈ సినిమా నాలుగు సంవత్సరాల పాటు చిత్రీకరించారు.  ఈ మూవీ కన్నడ, హిందీ, తెలుగు భాషల్లో నిర్మించి డిసెంబరు 21,2018వ తేదీన ప్రపంచవ్యాప్తంగా  2400 థియేటర్లలో విడుదల చేశారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి నుంచి భారీ అంచనాలు క్రియేట్ చేస్తూ వచ్చింది.

ఈ సినిమాలో యష్ మాస్ లుక్ కి అన్ని వర్గాల ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు.  విడుదలైన అన్ని భాషల్లో ఈ మూవీకి హిట్ టాక్ వచ్చింది.  కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అక్రమ గోల్డ్ మైనింగ్‌ నేపథ్యంలో ఈ సినిమా తీశారు. ఓ క‌న్న‌డ సినిమాకి అంత‌టా ఇంత ఆద‌ర‌ణ లభించ‌డంతో చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది. నేటితో ఈ మూవీ వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్  వంద రోజులు పూర్తి చేసుకుంద‌ని తెలియ‌జేస్తూ పోస్ట‌ర్ విడుద‌ల చేసింది.   

ఇటీవ‌ల కేజీఎఫ్ మూవీ సీక్వెల్ పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకోవ‌డంతో పాటు చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటుంది.  2020లో ఈ మూవీని విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నారట. ఈ సినిమాలో కీలక పాత్ర‌ల‌లో ర‌మ్య‌కృష్ణ‌, సంజ‌య్ ద‌త్‌ని తీసుకోవాల‌ని చిత్ర యూనిట్ భావిస్తుంద‌ట‌. బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌, క‌న్న‌డ రియ‌ల్ స్టార్ ఉపేంద్ర‌ కూడా ఈ మూవీలో నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: