మాలీవుడ్ బ్యూటీ నివేధ థామస్ - శ్రీవిష్ణు - సత్యదేవ్- నివేద పెథురాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా `బ్రోచేవారెవరురా`.   ఈ సినిమా వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. మన్యం ప్రొడక్షన్స్ పతాకంపై విజయ్ కుమార్ మన్యం నిర్మిస్తున్నారు.  ఈ మూవీ పూర్తిగా వినోదాత్మకంగా తీస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఆ మద్య ఓ ఇంటర్వ్యూలో ఈ మూవీలో తన పాత్ర పూర్తిగా వినోదాత్మకంగా ఉండబోతున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం నిర్మాణానంతర పనులు సాగుతున్నాయి. మేలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాల్లో ఉన్నారు. తాజాగా ఈ సినిమా నుంచి నివేద థామస్ పోస్టర్ ను వదిలారు .. 'మిత్ర' అనే పాత్రలో ఆమె కనిపించనుందంటూ పరిచయం చేశారు. ఈ సినిమా పూర్తిగా సినీ నేపథ్యంలో సాగుతుందట. ఒక ఆర్టిస్ట్ గానే అందులో నివేద కనిపించనుందని ఈ పోస్టర్ ను బట్టి అర్థమవుతోంది.

ఇక  ``యుక్త వయసు అమ్మాయిలు బలమైన వ్యక్తిత్వం ఉన్నవారిగా మారితే అది ఎంతో అందం. ప్యాషన్.. సెల్ఫ్ రెస్పెక్ట్.. పెయిన్ & స్పిరిట్ ఆఫ్ లైఫ్ ఇవన్నీ వారేమిటో నిర్ణయిస్తాయి. అలాంటి ఓ అమ్మాయి మిత్రగా నటిస్తున్నా... ఆ పాత్రలో నటించడం గర్వంగా ఉంది``  తన అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ  సినిమాలో, ప్రియదర్శి .. రాహుల్ రామకృష్ణ .. సత్యదేవ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: