గత కొంత కాలం నుండి సరైన హిట్ కోసం బ్లాక్ బస్టర్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు మెగా హీరో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. చిరంజీవి పాత సినిమా పాటలను రీమిక్స్ చేస్తూ మెగా అభిమానులను ఆకర్షిస్తూ ఎన్ని ప్రయత్నాలు జరిపిన బాక్సాఫీస్ దగ్గర సరైన హిట్టు పడకపోవడంతో ప్రస్తుతం నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో చిత్రలహరి సినిమా చేస్తున్నాడు సాయి ధరమ్ తేజ్.

Image result for JR NTR SAI DHARAM TEJ

ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ పక్కన హీరోయిన్లుగా క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, నివేథా పేతురాజ్ నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయిన నేపథ్యంలో వేసవి కానుకగా ఏప్రిల్ 12 వ తారీఖు న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాతలు విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్న క్రమంలో ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను భారీ ఎత్తున చేయాలని భావిస్తున్న నిర్మాణ సంస్థ ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక కు చీఫ్ గెస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ ని ఆహ్వానించినట్లు సమాచారం.

Image result for JR NTR SAI DHARAM TEJ

దీంతో ఇప్పుడు ఈ విషయం ఫిలింనగర్ లో పెద్ద హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా ‘జనతాగ్యారేజ్' తర్వాత మైత్రి మూవీ మేకర్స్ వారితో యంగ్ టైగర్‌కు మంచి అనుబంధం ఏర్పడింది. ఆ సాన్నిహిత్యంతోనే యంగ్ టైగర్‌ను ఈ వేడుకకు ఆహ్వానించినట్లు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: