రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్ఠీఆర్' కు విమర్శకుల నుండి ప్రశంసలు లభించకపోయినా ఆమూవీ కలక్షన్స్ బాగా ఉండటం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ మూవీ ఆంధ్రప్రదేశ్ లో విడుదల కాకపోయినా ఈమూవీకి నైజాం ప్రాంతంలో అదేవిధంగా ఓవర్సేస్ లో వస్తున్న కలక్షన్స్ హాట్ టాపిక్ గా మారాయి. 

దీనితో మరింత రెచ్చి పోయిన వర్మ ఈ మూవీని మరింత భారీగా ప్రమోట్ చేయడానికి భారీ వ్యూహాలు రచిస్తున్నారు. ఈమూవీ సక్సస్ తో మంచి జోష్ లోకి వెళ్లిపోయిన వర్మ అల్లు అర్జున్ 'రుద్రమ దేవి' సినిమాలో నటించిన 'గోనగన్నా రెడి పాత్ర ఫోటోకు బన్నీ ముఖాన్ని తీసివేసి తన ముఖాన్ని పెట్టి ఒక ఫోటోను తన ట్విటర్ లో షేర్ చేసాడు. 

అంతేకాదు 'బాహుబలి' మూవీని టార్గెట్ చేస్తూ తన ఫోటోకు రామ్ బలి అన్న ట్యాగ్ కూడ పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఈ ఫోటోకు కేవలం వర్మ అభిమానులు మాత్రమే కాకుండా అందరూ లైక్స్ కొడుతున్నారు. ఇది ఇలా ఉండగా ఈ మూవీలో నటించిన లక్ష్మీ పార్వతి పాత్రధారి యజ్ఞ శెట్టి ఎన్ఠీఆర్ పాత్రలో నయించిన విజయ్ కుమార్ చంద్రబాబు పాత్రలో నటించిన శ్రీ తేజ ఒకేసారి వారి వారి నటనా సామద్యంతో అందరిదృష్టినీ ఆకర్షించడమే కాకుండా ఏకంగా వీరితో మీడియా ఇంటర్వ్యూలు కూడ వచ్చేస్తున్నాయి. 

అంతేకాదు చాల మంది  చిన్న సినిమాల దర్శక నిర్మాతలు అప్పుడే వీరితో తమ సినిమాలకు సంబంధించి చర్చలు కూడ చేస్తున్నట్లు టాక్. గత కొన్ని సంవత్సరాలుగా వర్మ సినిమాలు అంటే ప్రేక్షకులు భయపడి పోతున్న పరిస్థుతులలో 'లక్ష్మీస్ ఎన్ఠీఆర్' మూవీకి కలక్షన్స్ బాగా వస్తున్న నేపథ్యంలో వర్మ ఈ ఉత్సవాహంతో మరిన్ని ప్రయోగాలు చేసే ఆస్కారం ఉంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: